/rtv/media/media_files/2025/04/22/vm2QoWrnWM00GDUzLcsq.jpg)
J&K Terror Attack: జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గామ్లో టూరిస్ట్ లపై జరిగిన టెర్రర్ ఎటాక్లో 27మంది మృతి చెందారు. మరో 20మంది ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. పర్యాటకులనే టార్గెట్గా చేసుకొని ఈ అటాక్ జరిగింది. టూరిస్టుల వరసులో నిల్చేబెట్టి పేరు, మతం ఏంటని అడిగి టెర్రరిస్టులు కాల్చి చంపారని ఓ మహిళ తెలిపారు. కర్ణాటకకు చెందిన జంట పల్లవి భర్త పేరు, మతం అడిగిన తర్వాత ఉగ్రవాదులు మంజునాథ్పై కాల్పులు జరిపారని ఆమె చెప్పారు. ఈ దాడిలో ఆమె కూడా తీవ్రంగా గాయపడ్డారు. సమ్మర్ వెకేషన్ కోసం వారు జమ్మూ కాశ్మీర్ వచ్చారు.
Also Read : ఉగ్రదాడి.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలను పట్టించుకోలేదా ?
Manjunath & Pallavi from Karnataka were on vacation in Kashmir.
— Mr Sinha (@MrSinha_) April 22, 2025
Husband Manjunath was k*lled by Islamic terrorists after they confirmed his Hindu identity.
She begged them to k*ll her as well, but jihadis said, "You need to be alive to tell this to Modi."
What a barbaric cult.… pic.twitter.com/8c3MTy4wVh
Also read: J&K Terror Attack : పాపం.. హనీమూన్కు వచ్చి కట్టుకున్న భర్తను కోల్పోయింది( Video Viral)
ముంబై ఉగ్రదాడుల తర్వాత ఎక్కువ మంది పౌరులు చనిపోయిన దాడి
ది రెసిస్టెంట్ ఫ్రంట్(TRF) అనే ఉగ్రవాద సంస్థనే దాడి చేసినట్లు ప్రకటించింది. ఇండియన్ ఆర్మీలా యూనిఫాంలో వచ్చి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ముంబై ఉగ్రదాడుల తర్వాత ఎక్కువ మంది పౌరులు చనిపోయిన దాడి ఇదే. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఉగ్రవాదులను వేటాడేందుకు భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో తమిళనాడు,ఒడిశా,గుజరాత్, మహారాష్ట్ర,కర్నాటకకు చెందిన టూరిస్ట్లకు గాయాలయ్యాయి.
Also read: ముంబై నుంచి హీరోయిన్ని తీసుకొచ్చి.. అరెస్టైన ఆ IPS చేసిన పని ఇదేనా..?
A newlywed’s honeymoon turned into horror in #Pahalgam as terrorists shot her husband for not being Muslim. They asked his name, caste then killed him point-blank in kashmir. Her life shattered forever.#Kashmir #UPSC pic.twitter.com/4s1OYAdsiE
— Rebel_Warriors (@Rebel_Warriors) April 22, 2025
అమర్నాథ్ యాత్రకు కొద్దిసేపటి ముందు ఈ దాడి జరగడం కలకలం రేపింది. అమర్నాథ్ యాత్ర భద్రత గురించి ప్రశ్నలు తలెత్తాయి. 38 రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర జులై 3 నుంచి ప్రారంభం కానుంది. ఎత్తైన కొండలు లోయల్లో ఉన్న సంఘటనా స్థలానికి చేరుకోవాలంటే గుర్రాల మీదనే వెళ్లడం సాధ్యం. వాహనాలు అక్కడికి వెళ్లడం కష్టం. దీంతో సైన్యం గాయపడిని వారిని కాపాడటానికి హెలికాఫ్టర్ వినియోగిస్తున్నారు.
Also read: BIG BREAKING : జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో 27మంది మృతి!
(terror-attack | Pahalgam attack | jammu-and-kashmir | latest-telugu-news)