AI 171 Horror: బోయింగ్ డ్రీమ్ లైనర్లపై చర్చ..బోయింగ్ 787లో లోపాలు..ఏడాది క్రితమే ఫిర్యాదు

అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 యే కాకుండా డ్రీమ్ లైనర్ మోడల్స్ 777లో కూడా లోపాలున్నాయని గతేడాదే ఆరోపణలు వచ్చాయి.787లో ప్రతీ రెండు విడి భాగాలకు మధ్య గ్యాపులుంటాయని..వియాన తయారీలో కంపెనీ అడ్డదారులు తొక్కిందని ఒక ఇంజనీర్ ఫిర్యాదు ఇచ్చారు.

New Update
flight

AI 171 Horror

భారత్ లో జరిగిన విమాన ప్రమాదాల్లో అత్యంత పెద్దదిగా ఈరోజు అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ నిలిచింది. బయలుదేరిన కొన్ని నిమిషాలకే విమానం కూలిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్‌ అయిన నిమిషాల్లోనే కుప్పకూలింది. బోయింగ్‌కు చెందిన 787 డ్రీమ్‌లైనర్‌ ఈ విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ మధ్య కాలంలో బోయింగ్ విమానాలు చాలానే యాక్సిడెంట్ కు గురవుతున్నాయి. ఇప్పుడు డ్రీమ్ లైనర్ బోయింగ్ కూలిపోవడంతో బోయింగ్‌ విమానాల భద్రత అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో డ్రీమ్ లైనర్ విమానాల గురించి అందరూ ఆరా తీస్తున్నారు. దాంట్లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. 

Also Read :  విమాన ప్రమాదానికి 3 కారణాలివే.. అంతా బ్లాక్ బాక్స్‌లోనే.. ఎక్స్పర్ట్ సంచలనం!

డ్రీమ్ లైనర్స్ బోయింగ్ ఫ్లైట్స్...

ఇది అమెరికాకు చెందిన విమాన నిర్మాణ సంస్థ. వైడ్‌ బాడీ మోడల్స్‌లో 787-8 డ్రీమ్‌లైనర్‌ ఒకటి. ఇందులో ఒకేసారి 242-290 మంది వరకు ప్రయాణించొచ్చు. వీటిని 2011 నుంచి వాడుతున్నారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ నాన్ స్టాప్ గా 13, 530 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఎక్కువ దూరాలు నాన్ స్టాప్ గా ప్రయాణించాలంటే ఈ డ్రీమ్ లైనర్ బోయింగ్ లను వినియోగిస్తున్నారు.  ఈ మొత్తం విమానం 50% కంటే ఎక్కువ కార్బన్ ఫైబర్ సమ్మేళనాలతో నిర్మితమైంది. ఇది స్టీల్ కంటే బలంగా ఉంటుందని తెలుస్తోంది. పర్యావరణ హితమని కూడా దీనికి పేరు ఉంది. 

Also Read :  జస్ట్ మిస్.. అమెరికాలో మరో విమాన ప్రమాదం..!

కానీ చాలా లోపాలు..

అయితే డ్రీమ్ లైనర్ విమానాల్లో టెక్నికల్ ప్రాబ్లెమ్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటున్నాయి. ముఖ్యంగా బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానంలో ఎక్కువగా బయటపడ్డాయి.  హైడ్రాలిక్ లీక్ సమస్యలు, బ్యాటరీ సమస్యలతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దీనికి సంబంధించి బోయింగ్ ఇంజీనీర్, విజిల్ బ్లోయర్ సామ్ సలేపూర్ ఏడాది క్రితమే ఫిర్యాదు చేశారు. న్యూయార్క్‌ టైమ్స్‌, సీఎన్‌ఎన్‌ వంటి మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో  దీనిపై ఆరోపణలు చేశారు.   777, 787 విమానాల నిర్మాణాల్లో నాణ్యత లేదని ఆయన చెప్పారు.  787లో ప్రతీ రెండు విడి భాగాలకు మధ్య గ్యాపులుంటాయని..వియాన తయారీలో కంపెనీ అడ్డదారులు తొక్కిందని అన్నారు. దీనివలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని..వాటి తయారీ పూర్తిగా నిలిపేయాలని సామ్ చెప్పారు. కానీ ఆయన మాటలను, ఫిర్యాదులను పెద్దగా పట్టించుకోలదు. ఇప్పుడు తాజా యాక్సిడెంట్ తరువాత జరిగే దర్యాప్తులో ఇంజనీర్ చెప్పింది నిజమో కాదో తెలుస్తుంది. 

Also Read :  రాహుల్ గాంధీ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీఎం ఫైర్

Also Read :  ముంబయ్ నుంచి లండన్ విమానం..మూడు గంటలు గాల్లోనే..వెనక్కి..

boing | today-latest-news-in-telugu | Ahmedabad-London flight crash

Advertisment
Advertisment
తాజా కథనాలు