/rtv/media/media_files/2024/11/19/flikAm5BYLbJYpGMKBE2.webp)
ఏమైందో తెలియదు..ఈరోజు తెల్లవారు ఝామున 5.39 గంటలకు ఎయిరిండియా ఏఐసీ129 విమానం ముంబై నుంచి లండన్ కు బయలుదేరింది. మూడు గంటలపాటూ గాల్లోనే తిరిగింది. మళ్ళీ తిరిగి వెనక్కు ముంబైకే వచ్చేసింది. విమానాన్ని మళ్ళించడానికి కారణాలు ఏంటో మాత్రం తెలియలేదు. అయితే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్తతలు నడుస్తున్నాయి. దీని కారణంగా గగనతలాలపై ఆంక్షలు విధించారు. ప్రపంచ వ్యాప్తంగా విమానాలు దారి మళ్ళిస్తున్నాయి. మరికొన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. ముంబై, లండన్ విమానం కూడా ఈ కారణం వల్లనే మూడు గంటలపాటూ తిరిగి తిరిగి వెనక్కు వచ్చిందని అంటున్నారు.
Air India flight AIC129, which took off early morning today from Mumbai for London, is returning to Mumbai, according to Flightradar24. More details are awaited. pic.twitter.com/BmRtlkmaut
— Press Trust of India (@PTI_News) June 13, 2025
అహ్మదాబాద్ ఎయిర్ క్రాఫ్ట్ కూలిన ఘటన తీరని విషాదాన్ని మిగిల్చింది. బయలు దేరిన కొద్దిసేపటికే కూలిపోయిన ఫ్లైట్ తరువాత మంటల్లో దగ్ధం అయిపోయింది. ప్రయాణికులు 229 మందితో పాటూ ఇద్దరు పైలెట్లు, సహాయ సిబ్బంది 12 మంది మొత్తం అందరూ చనిపోయారు. అలాగే విమానం మెడికల్ కాలేజీ హాస్టల్ మీద పడడంతో అక్కడి విద్యార్థులు 24 మంది మృత్యువాత పడ్డారు. ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం మధ్యాహ్నం 1.38 గంటలకు టేకాఫ్ అయింది.