/rtv/media/media_files/2025/06/13/LTrGzLqMCe8tstxERGA8.jpg)
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్ గాంధీ చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ కామెంట్స్పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. నకిలీ ఓటర్లు అనే రాహుల్ గాంధీ వాదనలను ఆయన తిప్పికొట్టారు. రాహుల్ గాంధీ ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. చివరి నిమిషంలో అధిక ఓటింగ్ శాతం NDA అభ్యర్థులకు అనుకూలంగా ఉందనే రాహుల్ గాంధీ వాదనలు హాస్యాస్పదమని ఫడ్నవీస్ అన్నారు. ఎన్నికల్లో ప్రజలచే తిరస్కరించబడిన రాహుల్ గాంధీ ఇప్పుడు వారి నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తు్న్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు మహారాష్ట్ర పౌరులకు అవమానమని మండిపడ్డారు. అలాంటి వాదనలను ప్రజలు, తాను కూడా క్షమించనని హెచ్చరించారు.
Here's what #Maharashtra #CM Devendra Fadnavis (@Dev_Fadnavis) said on Lok Sabha #LoP Rahul Gandhi's '#match-#fixing in #Maharashtra elections' remark.
— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) June 8, 2025
"I just want to say one thing to Rahul Gandhi that his whole life he kept committing….."#RahulGandhi #DevendraFadanvis pic.twitter.com/qaxgYHo1I6
ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, బిజెపి చీఫ్ జెపి నడ్డా, భారత ఎన్నికల కమిషన్ కూడా గాంధీ వాదనలను తోసిపుచ్చారు. ది ఇండియన్ ఎక్స్ప్రెస్లో పబ్లిష్ అయిన రాహుల్ గాంధీ ఆర్టికల్ విస్మరించబడాలని ఫడ్నవీస్ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ మహారాష్ట్ర ప్రజలను విడగొట్టాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. గతంలో ఆయన ఎన్నికల కమిషనర్ నియామకాలను కూడా తప్పుబట్టిన విషయాన్ని గుర్తు చేశారు ఫడ్నవీస్.
రాహుల్ గాంధీ ఓటమి తర్వాత తప్పుడు కథనాలు సృష్టిస్తారని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. ఆత్మపరిశీలన చేసుకునే బదులు, ఆయన కట్టుకథలు రూపొందిస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అన్నారు. రాహుల్ గాంధీ అబద్ధాలకు ఆధారాలు లేవని, ఎలక్షన్ కమిషన్ను కించపరుస్తున్నారని జేపీ నడ్డా మండిపడ్డారు.