/rtv/media/media_files/2025/05/30/ol67FpCjqlQlq6nyh6FA.jpg)
Vigilance raids at corrupt official's house
Odisha Engineer: ఒడిశా భువనేశ్వర్లో ఓ ప్రభుత్వ ఇంజినీర్(Govt Employee) ఇంటిపై విజిలెన్స్ అధికారులు(Vigilance Officers) అకస్మాత్తుగా దాడులు జరిపారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో ఆదాయానిక మించి ఆస్తులు(Illegal Asset) బయటపడ్డాయి. అయితే విజిలెన్స్ అధికారులు ఒక్కసారిగా దాడులు చేయడంతో కంగారు పడ్డ అధికారి ఏం చేయాలో అర్థం కాక నోట్లను కిటికీ నుంచి బయటకు విసిరేశాడు. అధికారి ఇంటి కిటికీ నుంచి నోట్ల వర్షం కురుస్తుండటంతో స్థానికులు అవాక్యయ్యారు. ఒడిశాలోని భువనేశ్వర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Also Read: Pakistan: బుద్ధి మార్చుకోని పాక్.. పుల్వామా తరహా దాడికి స్కెచ్.. ఇదిగో ప్రూఫ్!
Government engineer throws cash out of window during raid, Rs 2.1 crore seized pic.twitter.com/CSQMNw8e7m
— Karthick Chandrasekar (@kart997) May 30, 2025
ఆదాయానికి మించి ఆస్తులు..
ఈ సంఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఒడిశా రూరల్ డెవలప్మెంట్ విభాగంలో చీఫ్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్న బైకుంఠనాథ్ సారంగి. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు రావడంతో విజిలెన్స్ అధికారులు ఆయనకు సంబంధించిన ఏడు చోట్ల దాడులు నిర్వహించారు.
Also Read: ఇండియాలో సివిల్ డిఫెన్స్ మాక్డ్రిల్ వాయిదా.. ఎందుకంటే?
ఈ సందర్భంగా అధికారుల రాకను గమనించిన సారంగి ఆ డబ్బు వారి కంట పడకూడదని తన ప్లాట్ కిటికీ నుంచి నోట్ల కట్టలను బయటకు విసిరారు. కానీ ఈ దృశ్యాలన్నీ ప్రత్యక్ష సాక్షుల సమక్షంలోనే చోటు చేసుకోవడంతో అధికారులు వెంటనే స్పందించి ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో భాగంగా అధికారులు రూ. రెండు కోట్లకు పైగా నగదును పట్టుకున్నారు.మొత్తం 26 మంది విజిలెన్స్ అధికారులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు.వారు నోట్ల కట్టలను లెక్కగట్టుతున్న దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి.ఈ దాడులతో ఆయన వద్ద ఇంకా ఎంత అక్రమ సంపాదన ఉందో అనే చర్చ జోరుగా సాగుతోంది.
Also Read: కరోనా పేషేంట్ ని చంపేయ్.. ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకున్న ఆడియో వైరల్!
Also Read: హైదరాబాద్లో అమానుషం.. కారుపై గీత పడ్డందుకు ఖతం చేశాడు!
latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu