/rtv/media/media_files/2025/04/15/1OmxEDN5pshD15P0m2dd.jpg)
Ayodya Ram mandir
Ram Darbar Pran Pratishtha : కలియుగ దైవంగా భావించే శ్రీరాముని జన్మస్థలం అయోధ్యలో ఐదు దశాబ్ధాల తర్వాత ఆలయ నిర్మాణం జరిగింది. న్యాయస్థానాల్లో వివాదాలు.. పలు తీర్పులు అనంతరం.. నవంబరు 2019లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ముగింపు పడింది. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత వివాదాస్పద ప్రాంతంగా సీజ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఆ స్థలం హిందువులకు చెందింది. దీంతో భవ్యమైన ఆలయ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. మసీదు నిర్మాణానికి యూపీ ప్రభుత్వం ఐదెకరాల స్థలం కేటాయించింది.
श्री राम जन्मभूमि मंदिर का दिव्य स्वर्णमंडित शिखर तथा नवनिर्मित प्रथम तल
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) June 2, 2025
The divine, gold-adorned shikhar and the newly constructed first floor of the Shri Ram Janmabhoomi Mandir. pic.twitter.com/yIIUUcxoJx
Also Read: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!
సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండి..
— RTV (@RTVnewsnetwork) June 4, 2025
RTV న్యూస్ యాప్ ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్క్లూజీవ్ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ RTV న్యూస్ యాప్ ను ప్లేస్టోర్లో అప్డేట్చేసుకోండి. ఈ కింది లింక్స్ పై క్లిక్ చేసి నేరుగా మీ… pic.twitter.com/ImFUCn2AfR
Also Read: ఈ సాలా కప్ నమ్దే..18 ఏళ్ళ కల... బెంగళూరు రాయల్ విన్నింగ్
అయోధ్య రామమందిరంలో మరోసారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతోంది. ఆలయ మొదటి అంతస్తులో రామ్ దర్శన్ (రామ్ దర్భార్) ప్రతిష్ఠా కార్యక్రమం మంగళవారం ఉదయం 6.30 గంటలకు మొదలైంది. మూడ్రోజులపాటు ఈ వేడుకలు జరగనున్నాయి. గురువారంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఆ రోజు గంగా దసరా కావడం మరో విశేషం. రామ్ దర్బార్ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆలయంపై బంగారు శిఖరాన్ని ఏర్పాటు చేశారు. దీంతో గుడి ఇప్పుడు ప్రత్యేక శోభను సంతరించుకుంది. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వీఐపీలను ఆహ్వానించలేదు. రాజకీయ నేతలు కూడా ఈ కార్యక్రమానికి రావడం లేదు. సాధారణ భక్తులు, వేద పండితుల మధ్య సాదాసీదాగా నిర్వహిస్తున్నారు. ప్రధాన యాగాచార్యులు జై ప్రకాశ్ త్రిపాఠి మీడియాతో మాట్లాడుతూ.. ‘శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించాం. రామ్ లల్లా ఇప్పుడు రాజాధిరాజు రూపంలో దర్శనమిస్తారు’ అని పేర్కొన్నారు. మరో పండితుడు మాట్లాడుతూ.. ‘ప్రతి క్రతువు విజయవంతంగా సాగింది. రాముడి ఉనికి ఇప్పుడు ఒక రాజుగా మారుతోంది’ అన్నారు.
Also Read: ట్రంప్ సంచలన నిర్ణయం.. 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్
కాగా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ముగియగానే సరయూ జయంతి వేడుకలను వారం రోజుల పాటు నిర్వహిస్తున్నారు. జూన్ 5న మొదలయ్యే ఈ వేడుకల్లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు ఈ వేడుకలు అంజనేయ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జూన్ 5 నుంచి 11వ తేదీ వరకు సాగుతాయి. ఇందులో భక్తి సంగీత కచేరీలు, పౌరాణిక ఉపన్యాసాలు, సాంప్రదాయ పూజలు జరుగుతాయి.
Also Read: బెంగళూరు కోసమే నేనున్నా...విరాట్
Also Read: కెప్టెన్ మారాడు కథ మారింది..