/rtv/media/media_files/2025/10/17/tiger-chased-the-farmers-in-karnataka-2025-10-17-19-24-43.jpg)
Tiger chased the farmers in Karnataka
కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ పులి పొలంలో పనిచేస్తున్న రైతులను వెంబడించింది. దీంతో తమ ప్రాణాలు రక్షించుకునేందుకు కొందరు చెట్లు ఎక్కారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ రైతును పులి దాడి చేసింది. అతడు తీవ్రంగా గాయాలపాలయ్యాడు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
Too many tigers? A tiger attacked a person in Badagalpura village, HD Kote, Mysore district.
— True Conservation Alliance (@TruConserve) October 17, 2025
The victim survived.
At least six transient tigers are on the move in HD Kote.
A tigress was captured in Hediyala (Bandipur) on Sunday and sent to the rehab centre. pic.twitter.com/d9erfohjtR
Also Read: హిందూ అమ్మాయిలు జిమ్లకు వెళ్లకండి.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్
ఇక వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని బడగలపుర గ్రామంలో గురువారం ఉదయం కొంతమంది రైతులు పొలాల్లో పని చేసుకుంటున్నారు. ఈ సమయంలోనే ఒక్కసారిగా చెట్ల పొదల్లో నుంచి ఓ పులి బయటకు పరిగెత్తుతూ వచ్చింది. పొలాల్లో పనిచేస్తున్న రైతుల వైపు దూసుకెళ్లింది. పులిని చూసిన వాళ్లు భయంతో పరుగులు తీశారు. కొందరు చెట్లు ఎక్కారు. ఈ క్రమంలోనే మహాదేవ్(34) అనే రైతుపై పులి దాడి చేసింది. దీంతో అతడు తీవ్రంగా గాయాలపాలయ్యాడు. ఆ తర్వాత పులి అక్కడి నుంచి పారిపోయింది. గాయాలపాలైన మహాదేవ్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్థులు చెబుతున్నారు.
Also Read: ఆకాశాన్ని తాకుతున్న బంగారం, వెండి ధరలు.. ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా ?
ఇదిలాఉండగా ఆ ప్రాంతంలో పులి సంచరిస్తోందని చెప్పినా కూడా అటవీ అధికారులు పట్టించుకోలేదని స్థానికులు మండిపడ్డారు. ఈ క్రమంలోనే దీనిపై అటవీశాఖ అధికారులు కూడా స్పందించారు. పులిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. దాని ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇదిలాఉండగా ఈ మధ్య కాలంలో అనేక ప్రాంతాల్లో జనావాసాల్లోకి పులులు వస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కోతులు ఇళ్లల్లోకి వస్తుండగా.. ఇప్పుడు పులులు, సింహాలు కూడా రావడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: ఈ అక్కాచెల్లెళ్లు మామూలోల్లు కాదు.. పెళ్లిళ్లు చేసుకుంటూ డబ్బులు, నగలతో పరార్