Police Custody for Terror Suspects: పోలీస్ కస్టడీకి ఉగ్ర కుట్రదారులు.. ఎన్ఐఏతో కలసి ఐదు రోజుల పాటు...

దేశంలో ఉగ్రదాడులకు పాల్పడేందుకు కుట్ర పన్నారన్న కేసులో అరెస్టయిన సిరాజ్‌, సమీర్‌లను పోలీస్‌ కస్టడీకి తరలించేందుకు కోర్టు అనుమతించింది. ఉగ్ర కుట్ర కేసులో ఏపీలోని విజయనగరానికి చెందిన సిరాజ్‌, తెలంగాణకు చెందిన సమీర్‌ను 5 రోజులపాటు పోలీసులు విచారించనున్నారు.

New Update
Terror conspirators in police custody

Terror conspirators in police custody

Police Custody for Terror Suspects: దేశంలో ఉగ్రదాడులకు పాల్పడేందుకు కుట్ర పన్నారన్న కేసులో అరెస్టయిన సిరాజ్‌, సమీర్‌లను పోలీస్‌ కస్టడీకి తరలించేందుకు కోర్టు అనుమతించింది. ఉగ్ర కుట్ర కేసులో ఏపీలోని విజయనగరానికి చెందిన సిరాజ్‌, తెలంగాణకు చెందిన సమీర్‌ను 5 రోజులపాటు పోలీసులు విచారించనున్నారు. కాగా వీరిద్దరినీ  జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)తో కలిసి విజయ నగరం పోలీసులు విచారించనున్నారు. గురువారం నుంచి ఐదు రోజుల పాటు సాగనున్న విచారణ కోసం ఎన్‌ఐఏకు చెందిన ఉన్నతస్థాయి విచారణ బృందం విజయనగరానికి చేరుకుంది. స్థానికంగా పోలీసుల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించింది.

Also Read: Cinema: వరుసపెట్టి బయోపిక్ లలో ధనుష్..అబ్దుల్ కలాంగా కొత్త సినిమా

కాగా నిషేధిత ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఏఎస్‌)తో సంబంధాలు పెట్టుకుని పేలుళ్లకు కుట్రపన్నిన సిరాజ్, సమీర్‌లు పోలీసులకు చిక్కి ఉండకపోతే పేలుళ్లకు పాల్పడి ఉండేవారని తెలుస్తోంది. దీనికోసం విజయనగరం జిల్లాలో జనం ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకున్నారని తెలిసింది. దానికోసం సిద్ధమవుతున్న తరుణంలోనే వీరు పోలీసులకు చిక్కినట్లు తెలిస్తోంది.పేలుడు పదార్థాలు, రాకెట్‌ లాంచర్ల తయారీకి అవసరమైన పీవీసీ పైపుముక్కలు, ఇతర సామగ్రిని శనివారమే కొనుగోలు చేసి ఐఈడీ(ఇంప్రవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైస్‌) తయారీకి సిద్ధమయ్యారని విచారణలో తేలింది. నిందితులు పేలుడు పదార్థాలను పరీక్షించే ప్రయత్నంలో ఉన్నారని దర్యాప్తులో తేలింది. ఆ క్రమంలో సామాజిక మాధ్యమాల ద్వారా ఓ హ్యాండ్లర్‌ పర్యవేక్షణలో రిమోట్‌తో పేల్చగలిగే ఇంప్రూవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌ (ఐఈడీ)లు తయారు చేయడం నేర్చుకుంటున్నట్లు జాతీయ సంస్థలు గుర్తించాయి.

Also Read :  రీతూ వర్మ రొమాంటిక్ థ్రిల్లర్.. ట్రైలర్ ఇక్కడ చూడండి!

Also Read: పహల్గాం ఉగ్రదాడికి ముందు.. ఢిల్లీలో ఐఎస్ఐ స్లీపర్ సెల్స్‌

ఇక నిందితులపాటు వారి కుటుంబ సభ్యలపై కన్నేసిన దర్యాప్తు సంస్థలు  సిరాజ్‌ బ్యాంక్‌ ఖాతాల్లో భారీగా నగదు ఉన్నట్టు గుర్తించి, వాటిని సీజ్‌ చేశాయి. ఇదే క్రమంలో ఏ ఎస్సైగా పనిచేస్తున్న సిరాజ్‌ తండ్రి డీసీసీ బ్యాంక్‌లో ఉన్న సిరాజ్‌ కు చెందిన లాకర్‌ ను తెరిచేందుకు చాలా ప్రయత్నం చేసినట్లు బ్యాంక్‌ అధికారులు తెలిపారు. అయితే  ఆ ఖాతాను సీజ్‌ చేసినందున లాకర్‌ను తెరవడం కుదరదని బ్యాంక్‌ అధికారులు స్పష్టం చేసినట్లు తెలిసింది. అయినా ఆయన రెండు రోజులపాటు బ్యాంక్‌ అధికారులను కలిసి లాకర్‌ తెరిపించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తున్నది. దీంతో సిరాజ్‌ తండ్రి, కుటుంబసభ్యులతోపాటు సమీర్‌ కుటుంబసభ్యుల కదలికలపై మరింత నిఘా పెంచాయి దర్యాప్తు సంస్థలు. కాగా ఐదు రోజుల కస్టడీలో నిందితులు ఎలాంటి సంచలన విషయాలు వెల్లడిస్తారో వేచి చూడాలి.

Also Read: భారతదేశ అణుశక్తి వాస్తుశిల్పి డాక్టర్ శ్రీనివాసన్ గురించి మీకు తెలుసా..?

Advertisment
Advertisment
తాజా కథనాలు