/rtv/media/media_files/2025/05/21/kcdEtx7Cbx8vR2bWrwst.jpg)
Supreme Court
ఓ విషయంలో సుప్రీం కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను తెలియజేయాలని నోటీసులు జారీ చేసింది. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా తమ నిర్ణయం చెప్పాలని కోర్టులు ఆదేశించవచ్చా? అనే అంశంపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ మేరకు అభిప్రాయం తెలియజేయాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 (1) కింద 14 ప్రశ్నలను సంధిస్తూ సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టును 14 ప్రశ్నలు సంధించారు. తాజాగా అంశంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది.
Also Read:పహల్గాం ఉగ్ర అనుమానితుడు అరెస్టు.. పట్టించిన ఫేసియల్ రికగ్నిషన్
Supreme Court Notices
The Supreme Court issues notice to the Union and all State governments seeking their responses to a reference sent by President Droupadi Murmu on whether the court can fix a timeline for the Governor or the President to give their assent to Bills passed by the State assemblies.… pic.twitter.com/jbFw5RbVbj
— ANI (@ANI) July 22, 2025
Also Read: భార్య చేతిలో బలైన మరో భర్త.. సాంబారులో విషం కలిపి హత్య
సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. వారంలోగా ఈ విషయంలో స్పందన చెప్పాలని ఆదేశించింది. ఈ అంశం రాష్ట్రానికి మాత్రమే కాదని.. దేశానికి సంబంధించిన విషయాన్ని గమనించాలని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
The #SupremeCourtofIndia issues a notice to the Centre and all the State governments on the Presidential Reference made by President #DroupadiMurmu, dealing with the Court's power to decide a timeline for assent on Bills to be signed by the Governor and the President
— CNBC-TV18 (@CNBCTV18News) July 22, 2025
Details… pic.twitter.com/RDqYL6cSD8
Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?
శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆమోదించడంలో గవర్నర్ తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆశ్రయించింది. ఈ విషయంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నిర్దిష్ట గడువులోగా బిల్లులపై నిర్ణయం చెప్పాలని.. 3 నెలల్లోగా ఆమోదించడమే.. తిరస్కరించడమో చేయాలని సూచించింది. ఈ తీర్పు తర్వాత సైతం ఇలాగే చేస్తూ మళ్లీ తమను ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. రాష్ట్రాలు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకునే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు కాలపరిమితి ఎలా విధిస్తారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును ప్రశ్నించారు.
Also Read : వివో నుంచి మరో కిర్రాక్ స్మార్ట్ఫోన్.. ఈసారి తగ్గేదే లే!
latest-telugu-news | state-government | central-government | notices