/rtv/media/media_files/2025/04/20/zBogsx4iiEpIJWUTrQuo.jpg)
Mohan Bhagwat
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కుల భేదాలకు స్వస్తి పలకాలని హిందూ కమ్యూనిటీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఒకే గుడి, ఒకే బావి, ఒకే శ్మశాన వాటిక అనే సూత్రానికి మనమందరం కట్టుబడి ఉండాలని సూచనలు చేశారు. దీన్ని పాటిస్తూ సామాజిక సామరస్యానికి కృషి చేయాలంటూ కోరారు.
Also Read: ఐపీఎల్ ఆయన వల్లే సాధ్యమయ్యింది.. లలిత్ మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇక వివరాల్లోకి వెళ్తే.. అలీగఢ్లో ఐదు రోజుల పర్యటనలో భాగంగా మోహన్ భగవత్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలను పంచుకున్నారు. '' ప్రపంచంలో శాంతి స్థాపన కోసం ముందుగా భారత్ సామాజిక ఐక్యత సాధించడం చాలా కీలకం. హిందూ కమ్యూనిటీకి పునాదిగా భావించే సంస్కారం, సంప్రదాయం, సాంస్కృతి విలువలు, నైతిక సూత్రల పేరుతో ఆ చీకటి లోయల లోతుల్లో పాతుకున్న ఈ సమాజ ఆలోచన విధానాన్ని నిర్మూలించాలి.
Also read: 8వ తరగతి విద్యార్థి ఆట చూసేందుకే నిద్ర లేచా.. వైభవ్పై గూగుల్ సీఈఓ ప్రశంసలు
కుల భేదాలకు స్వస్థి పలకాలి. నేతిక విలువలు పాటిస్తూ సమాజంలో అన్ని వర్గాలను కలుపుకోవాలి. ఎలాంటి భేదాలు చూపించకూడదు. అన్ని వర్గాల వాళ్లని ఇళ్లల్లోకి ఆహ్వానించాలి. అట్టగుడు స్థాయిలో సామరస్యం ఐక్యతను వ్యాప్తి చేయాలి. సంస్కారం అనే పునాదిపై నుంచి కుటుంబం, దాని విలువలు రూపుదిద్దుకున్నాయి. జాతీయవాదం, సామాజిక ఐక్యత పునాదులను బలోపేతం చేసేందుకు అన్ని పండుగలను సామూహికంగా నిర్వహించాడం అనేది చాలా ముఖ్యమని'' మోహన్ భగవత్ అన్నారు.
Also Read: నిద్రమత్తులో డ్రైవర్ నిర్లక్ష్యం.. ఆగిఉన్న విమానాన్ని ఢీకొట్టిన టెంపో
Also Read: సీఎంకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ షాక్.. మర్యాదగా మాట్లాడలేనంటూ ఒమర్ అబ్దుల్లా ఫైర్!
telugu-news | rtv-news | mohan-bhagwat | rss-leader-mohan-bhagwat