Kolkata Doctor Murder Case: కోల్‌కతా హత్యాచార కేసు.. కోర్టు సంచలన నిర్ణయం!

కోల్‌కతా డాక్టర్‌ అత్యాచారం కేసులో సీల్దా కోర్టులో ఇరువైపుల వాదనలు ముగిశాయి. దోషి సంజయ్ రాయ్ కు ఉరిశిక్ష సరైనదని సీబీఐ లాయర్ కోర్టు ముందు  వాదించారు. తాను తప్పు చేయలేదని దోషి సంజయ్ రాయ్ కోర్టుకు తెలిపాడు. కోర్టు మధ్యాహ్నం గం.2:45కి తీర్పు వెల్లడించనుంది. 

author-image
By Krishna
New Update
Kolkata court

Kolkata court Photograph: (Kolkata court )

Kolkata Doctor Murder Case: కోల్‌కతా డాక్టర్‌ అత్యాచారం కేసులో సీల్దా కోర్టులో  ఇరువైపుల వాదనలు ముగిశాయి.  దోషి సంజయ్ రాయ్(Sanjay Roy) కు ఉరిశిక్ష సరైనదని సీబీఐ లాయర్ కోర్టు ముందు  వాదించారు. అత్యంత క్రూరమైన నేరానికి పాల్పడిన వ్యక్తికి గరిష్ఠ శిక్షను విధించాలని ప్రార్థిస్తున్నట్లు న్యాయస్థానానికి విన్నవించారు. మరొకరు ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా ఉండేలా తీర్పు ఉండాలన్నారు. పీజీ మెడిసిన్ చేస్తూ ఐపీఎస్  కావాలనుకున్న యువతి జీవితం, కలలను సంజయ్ చెరిపేశాడని సీబీఐ లాయర్ కోర్టు ముందు వాదించారు. అయితే తాను తప్పు చేయలేదని దోషి సంజయ్ రాయ్ కోర్టుకు తెలిపాడు. తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని వాపోయాడు. నేరం చేసినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారన్నాడు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు మధ్యాహ్నం గం.2:45కి తీర్పు వెల్లడించనుంది. 

31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై

కాగా ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సక్రమంగా విచారించలేదని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసును సీబీఐ సక్రమంగా విచారించి ఉంటే మరికొంత మందిని అరెస్టు చేసి దోషులుగా నిర్ధారించి ఉండేవారని పేర్కొన్నారు.  2024 ఆగస్టు 9న ఆర్జీకర్‌ మెడికల్‌ కళాశాలలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై.. పోలీస్‌ వాలంటీర్‌గా పనిచేస్తున్న సంజయ్‌ రాయ్‌ అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన అనంతరం దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సంజయ్‌ రాయ్‌ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశాయి. చివరికి ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తీర్పు వచ్చింది.

Also Read :  ఎంత బరితెగించార్రా : ఛీ.. ఛీ .. స్కూల్లో ఏంటీ పాడు పనులు!

ఆ రోజు ఏం జరిగిందంటే..?

2024, ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్.. ఆర్‌జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో నైట్ డ్యూటీలో ఉంది. బాధితురాలు భోజనం చేసిన అనంతరం విశ్రాంతి తీసుకోవడానికి చెస్ట్ డిపార్ట్‌మెంట్ సెమినార్ హాల్‌కు వెళ్లింది. ఆ తర్వాత శవమై కనిపించింది. అత్యంత దారుణమైన స్థితిలో మృతదేహం ఉండడం అందరినీ కలచివేసింది. విచారణ చేసిన పోలీసులు ఈ నేరానికి పాల్పడిన సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని పోలీసులు విచారించారు

Also Read :  జ్యూస్లో విషం కలిపి లవర్ను చంపిన కిలాడీ.. కోర్టు సంచలన తీర్పు

Also Read :  రాజకీయాల్లోకి కట్టప్ప కూతురు.. డీఎంకేలో కీలక పోస్ట్!

Advertisment
Advertisment
తాజా కథనాలు