/rtv/media/media_files/2025/02/09/hXLDWz2pSplXqOxZzuMM.jpg)
Prashanth Bhushan
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఆప్ మాజీ నేత, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందించారు. ఈ ఓటమికి కేజ్రీవాలే కారణమంటూ ఆరోపణలు చేశారు. '' పారదర్శకత, ప్రజాస్వామ్యం, జవాబుదారితనం కోసం రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఉండాల్సి పార్టీనీ అరవింద్ కేజ్రీవాల్ అవినీతిమయం చేశారు. తనకోసం రూ.45 కోట్లతో శీష్ మహాల్ నిర్మించుకున్నారు. లగ్జరీ కార్లలో తిరిగారు.
Also Read: పార్టీ ఎమ్మెల్యేలకు కేజ్రీవాల్ కీలక సూచనలు
నిజమైన పాలనను కేజ్రీవాల్ మరిచిపోయారు. అవినీతి మార్గంలో ప్రభుత్వాన్ని నడిపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్లందరూ ఓడిపోయారు. ఆప్ పతనానికి ఇది ఆరంభం. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినప్పుడు తాను చిన్న రూమ్లోనైనా ఉండగలనని చెప్పారు. కానీ ఆ తర్వాత అద్దాల మేడను కట్టుకున్నారు. ఆనందం అనేది విలాసవంతమైన భవనంలో జీవిస్తే దొరకదు. ప్రజలకు సేవ చేసినప్పుడే సంతోషం కలుగుతుందని'' కేజ్రీవాల్ అన్నారు.
Also Read: ఛత్తీస్గఢ్లో 31 మంది మావోయిస్టులు మృతి.. అమిత్ షా సంచలన ప్రకటన
ఇదిలాఉండగా.. 2015లో ప్రశాంత్ భూషణ్ ఆప్ నుంచి బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. ఇదిలాఉండగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాల్లో గెలిచిన సంగతి తెలిసిందే. ఆప్ కేవలం 22 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ వరుసగా మూడోసారి కూడా ఖాతా తెరవలేదు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్తో పాటు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ లాంటి బడా నేతలు కూడా ఓడిపోయారు. సీఎ అతిషి మాత్రం కాల్కాజీ స్థానం నుంచి విజయం సాధించారు.
Also Read: అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో బీఫ్ బిర్యాని..!
Also Read: స్కూల్ డ్రెస్లో చెట్టుకు వేలాడుతూ కనిపించిన బాలికల మృతదేహాలు