Arvind Kejriwal: పార్టీ ఎమ్మెల్యేలకు కేజ్రీవాల్ కీలక సూచనలు

అతిషితో పాటు 22 మంది ఎమ్మల్యేలు అరవింద్ కేజ్రీవాల్‌ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రజల కోసం పనిచేయాలని కేజ్రీవాల్.. వారికి సూచనలు చేశారు. బీజేపీ హామీలు అమలు చేసేలా తాము చూస్తామని అతిషి మీడియాతో అన్నారు.

New Update
Arvind Kejriwal Meeting With Party MLA's

Arvind Kejriwal Meeting With Party MLA's

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆప్‌ ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు. ఫిరోజ్‌షా రోడ్‌లోని తన నివాసంలో అతిషితో పాటు 22 మంది ఎమ్మల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ప్రజల కోసం పనిచేయాలని కేజ్రీవాల్.. వారికి సూచనలు చేశారు. సమావేశం అనంతరం అతిషి మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుపరిచేలా ఆప్‌ నిర్మాణాత్మక విపక్ష పాత్రను పోషిస్తుందని చెప్పారు.   

Also Read: మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ రాజీనామా!

ప్రజలు కోసం పనిచేస్తూ వాళ్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మార్చి 8 నాటికి మహిళలకు నెలకు రూ.2500, 300 యూనిట్ల ఫ్రీ విద్యు్త్‌తో పాటు ఇతర సౌకర్యాలు అందించేలా చూస్తామని చెప్పుకొచ్చారు. అలాగే గత పదేళ్లలో ఆప్‌ ప్రభుత్వం అందించిన ఉచిత సేవలను నిలిపివేయకుండా ప్రజలకు అండగా నిలబడతామన్నారు. ఇక ఆప్‌ శాసనసభాపక్ష నేత ఎవరనేది తర్వాతి సమావేశంలో ఎన్నుకుంటామని స్పష్టం చేశారు.  

ఇదిలాఉండగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాల్లో గెలిచిన సంగతి తెలిసిందే. ఆప్‌ కేవలం 22 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్‌ వరుసగా మూడోసారి కూడా ఖాతా తెరవలేదు. ఆప్ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్‌ లాంటి బడా నేతలు కూడా ఓడిపోయారు. సీఎ అతిషి మాత్రం కాల్కాజీ స్థానం నుంచి విజయం సాధించారు. 

Also Read: ఛత్తీస్‌గఢ్‌లో 31 మంది మావోయిస్టులు మృతి.. అమిత్ షా సంచలన ప్రకటన

 మరోవైపు సీఎం ఎవరు అనేది ఆసక్తిగా మారింది. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.  ప్రధాని మోదీ ఈ నెల 10 నుంచి 13 వరకు ఫ్రాన్స్‌, అమెరికా పర్యటనలకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. అవి ముగించుకొని తిరిగి వచ్చాకే ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ సీఎం రేసులో మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కొడుకు పర్వేశ్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అలాగే బీజేపీ మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా, వీరేంద్ర సచ్‌దేవ, సతీశ్ ఉపాధ్యాయ్ తదితరులు సీఎం రేసులో ఉన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు