/rtv/media/media_files/2025/06/03/xmjMrxMX1sCyROgvixI1.jpg)
the drone-wars a new era of conflict
ఒకప్పుడు యుద్ధాలు అంటే మనుషుల మధ్యే జరిగేది. కానీ ప్రస్తుతం దీని పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టెక్నాలజీ పెరిగిపోవడంతో ఇప్పుడు గగనతలంలోనే దేశాల మధ్య దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి యుద్ధ వాతావరణంలో డ్రోన్ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోంది. శత్రువుల యుద్ధ ట్యాంకర్లు, బంకర్లు, రహస్య స్థావరాలు గుర్తించేందుకు డ్రోన్స్ ఎంతగానో సాయపడతాయి. రాత్రి సమయంలో కూడా నైట్ విజన్ లేదా థర్మల్ కెమెరాస్ సహాయంతో ఇవి పనిచేస్తాయి. వందలు, వేల కిలోమీటర్లు దాడి శత్రువులపై దాడి చేసే సామర్థ్యం డ్రోన్లకు ఉంటుంది. అందుకే ఇప్పుడు చాలా దేశాలు.. యుద్ధ వాతావరణం తలెత్తితే ఈ డ్రోన్ల దాడులనే ఎంచుకుంటున్నాయి.
రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ మధ్య ప్రస్తుతం యుద్ధాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ దేశాలు కూడా డ్రోన్ టెక్నాలజీనే వినియోగిస్తున్నాయి. ఇటీవల భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఇరు దేశాలు డ్రోన్లను వినియోగించాయి. గతంలో అమెరికా MQ-9 రీపర్ డ్రోన్ ద్వారా అల్ఖైదా నాయకులపై దాడులు చేసింది.
Also Read: ఇకనుంచి ఒకటవ తరగతి నుంచే బేసిక్ మిలిటరీ శిక్షణ !
ఫైటర్ జెట్లు, క్షిపణలు, ఇతర ఆయుధాలతో పోలిస్తే డ్రోన్ల ధర చాలా చౌకగా ఉంటుంది. ఇవి మానవ రహిత వాహనాలు కావడంతో శత్రువుల నుంచి దాడి జరిగిన ప్రాణనష్టం ఉండదు. అంతేకాదు డ్రోన్లు అధునాతన కెమెరాలతో లైవ్ వీడియో, హై డెఫినిషన్ (HD) ఫొటోలు కూడా అందిస్తాయి. శత్రువు గుర్తించకుండానే డ్రోన్లతో దాడులు చేయవచ్చు.రిమోట్ ద్వారా వీటిని కంట్రోల్ చేయొచ్చు. దేశం నుంచే ప్రపంచంలోని మరొక ప్రాంతంలో దాడి చేయగల సామర్థ్యం ఈ డ్రోన్లకు ఉంటుంది. అంతేకాదు అత్యంత కచ్చితత్వంతో ఇవి టార్గెట్పై దాడి చేయగలవు. ఒకవేళ చేయాల్సిన టార్గెట్ మారిపోయినా కూడా వాటికి కమాండ్స్ ఇచ్చి లక్ష్యాన్ని మార్చవచ్చు.
Also Read: ఇండియాకు చైనా వార్నింగ్.. ‘పాక్ లాగే మీకూ నీళ్లు ఉండవు’
ప్రస్తుతం డ్రోన్ టెక్నాలజీలో కృత్రిమ మేధస్సు (AI)ని కూడా అనుసంధానిస్తున్నారు. దీంతో మానవ జ్యోక్యం లేకుండానే ఏఐ ఆధారిత డ్రోన్లు తమ లక్ష్యాలపై నిర్ణయాలు తీసుకోగలవు, అలాగే తమ వ్యూహాలను మార్చుకోగలవు. అయితే ఈ ఏఐ డ్రోన్ టెక్నాలజీ వల్ల ఇవి సైబర్ దాడులకు కూడా గురయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రత్యర్థులు ఏఐ అల్గరిథంలోని బలహీనతలను ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ఆ డ్రోన్లు కూడా పనిచేయకపోవచ్చు. ప్రస్తుతం అమెరికా, చైనా, రష్యా, టర్కీ, ఇజ్రాయెల్ దేశాలకు ఏఐ ఆధారిత డ్రోన్లు ఉన్నాయి. భారత్లో ఇవి అభివృద్ధి దశలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఏఐ ఆధారిత డ్రోన్ టెక్నాలజీ మరింత పెరగనుంది. అయితే యుద్ధ భూమిలో ఈ డ్రోన్ టెక్నాలజీ వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి.
లాభాలు
1.ప్రమాదకర ప్రాంతాల్లో మానవ సైనికులను పంపకుండా డ్రోన్లను వాడటం వల్ల ప్రాణనష్టం తగ్గుతుంది
2.జీపీఎస్, ఏఐ, విజన్ సిస్టమ్స్ ద్వారా డ్రోన్లు లక్ష్యాన్ని ఖచ్చితంగా గుర్తించి దాడి చేయగలవు
3.శత్రు కదలికలు, వ్యూహాలను ముందుగానే తెలుసుకోగలవు
4.తక్కువ ఖర్చుతో డ్రోన్లు తయారుచేయవచ్చు
5.యుద్ధంతో పాటు బాధితుల కోసం మెడికల్ సపోర్ట్ లేదా సర్వే చేయడానికి కూడా వీటిని వాడవచ్చు
నష్టాలు
1.డ్రోన్లను తప్పుగా టార్గెట్ను గుర్తించడం వల్ల పౌరులు లేదా నిర్దోషులు మృతి చెందే ప్రమాదం ఉంటుంది
2.ఏఐ డ్రోన్లు హ్యాక్ అయితే.. అవి శత్రువుల చేతికి చేరి ఆయుధాలుగా మారవచ్చు
3.తక్కువ ఖర్చుతో చిన్న దేశాలు, ఉగ్రవాద సంస్థలు కూడా డ్రోన్లను ఉపయోగించగలవు. అందుకే ఈ ఈ టెక్నాలజీ ఇప్పుడు ప్రమాదకరంగా మారింది.
మొత్తానికి డ్రోన్ టెక్నాలజీ వేగంగా, కచ్చితంగా, తక్కువ మానవ నష్టంతో దాడులు చేసేందుకు ఉపయోగపడుతున్నా.. నైతిక, సాంకేతిక, భద్రతా సమస్యలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో AI నియంత్రణ, చట్టపరమైన మార్గదర్శకాలు అలాగే అంతర్జాతీయ ఒప్పందాలు అత్యవసరం అవుతాయి.
telugu-news | drone | artificial-intelligence | rtv-news