/rtv/media/media_files/2025/05/22/ISeGgB2YU1eU9PO1A1yY.jpg)
ప్రధాని మోదీ ఆపరేషన్ సిందూర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. బెంగాల్ గడ్డపై నుంచి 140 కోట్ల భారతీయుల తరపున ఆయన ప్రకటిస్తున్నానని అన్నారు. పశ్చిమ బెంగాల్లోని అలీపుర్దువార్లో ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. టెర్రరిజాన్ని పెంచి, పోషించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ సొంతగడ్డపైకి వెళ్లి ఇప్పటికే 3సార్లు దాడులు చేశామని మోదీ గుర్తు చేశారు. టెర్రరిస్టులు మన సోదరీమణుల సింధూరాన్ని తుడిచివేస్తే.. ఇండియన్ ఆర్మీ ఆ సింధూరం శక్తి ఏంటో వారికి తెలిసేలా చేసిందని చెప్పుకొచ్చారు. ఉగ్రవాదం పట్ల భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభించిందన్నారు.
Also Read : జూన్ 10 నాటికి జగన్ అరెస్టు ఖాయం.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Also Read : తెల్లటి మచ్చలను వదిలించుకోవాలనుకుంటున్నారా? ఇలా చేయండి
Operation Sindoor Is Not Over
"Pakistan should understand that we have hit them thrice by entering their territory. This is the declaration of 1.4 billion Indians from the land of the Bengal Tiger - Operation Sindoor is not over yet," says Prime Minister Narendra Modi in West Bengal's Alipurduar
— WION (@WIONews) May 29, 2025
.
.
Video:… pic.twitter.com/uUnlmk33C4
భారతీయ మహిళల గౌరవాన్ని అవమానించిన ఉగ్రవాదులపై దేశ సాయుధ దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. ఆపరేషన్ సిందూర్తో భారత్పై దాడి చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ప్రపంచానికి చాటిచెప్పామని ప్రధాని మోదీ తెలియజేశారు.
Also Read : పాకిస్తాన్తో అఫ్గనిస్తాన్ యుద్ధం.. భీకర కాల్పులు
Also Read : రాష్ట్రంలో వాటిని అణిచివేయడానికి స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు
prime-minister-modi | bengal | attack in Pahalgam | operation Sindoor | pakistan | terrorist | latest-telugu-news