/rtv/media/media_files/2025/05/15/6vnZTdpHREvOGnmlWCSd.jpg)
Pakistan strikes deal with Trump family-backed crypto venture
భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ జరిగేలా చేశానని.. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. అమెరికా-పాకిస్థాన్ మధ్య చీకటి ఒప్పందం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ కుటుంబ క్రిప్టో సంస్థతో పాక్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇక వివరాల్లోకి వెళ్తే.. వరల్డ్ లిబరేషన్ ఫైనాన్షియల్ అనే క్రిప్టో కంపెనీలో ట్రంప్ కుటుంబానికి 60 శాతం వాటా ఉంది.
Also Read: పాక్ అణు స్థావరాన్ని దెబ్బ కొట్టిన భారత్.. సంచలన ప్రకటన!
Also Read : వామ్మో.. మళ్లీ కరోనా కల్లోలం.. భారీగా కేసులు, మరణాలు!
Pakistan Strikes Deal With Trump Family
ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్తో ఈ వరల్డ్ లిబరేషన్ ఫైనాన్షియల్ సంస్థ డీల్ కుదుర్చుకుంది. ఈ సంస్థలో ట్రంప్ కుమారులు ఎరిక్, డొనాల్డ్ జూనియర్కు పెట్టుబడులు ఉన్నాయి. అయితే ఇస్లామాబాద్ను దక్షణాసియాలోనే క్రిప్టోలకు కీలకమైన హబ్గా మార్చే లక్ష్యంతో పాక్ కొన్నివారాల క్రితం ఈ క్రిప్టో కౌన్సిల్ను ఏర్పాటు చేసింది. తమ ప్రజల్లో క్రిప్టోలపై తమ ప్రయత్నానికి నమ్మకం కలిగించాలని పాక్ నిర్ణయించింది.
ఇటీవల ఇస్లామాబాద్లో కౌన్సిల్ నిర్వహించిన మీటింగ్కు కూడా ట్రంప్ అత్యంత సన్నిహితుడు స్టీవ్ విట్కాఫ్ కొడుకు, జాకరీ విట్కాఫ్ సైతం హాజరయ్యారు. వీళ్లకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ స్వాగతం పలికారు. ఇది జరిగిన తర్వాతే మునీర్ పహల్గాం ఉగ్రదాడికి గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఉగ్ర సంస్థలు వివిధ దేశాల ప్రభుత్వాలకు తెలియకుండా హవాలాకి బదులుగా నగదును తరలించేందుకు క్రిప్టో కరెన్సీలను వాడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
Also Read: 21 రోజులు నిద్రలేదు.. రహస్యాలు చెప్పాలంటూ BSF జవాన్కు పాక్ వేధింపులు!
Also Read : IPL 2025: ఐపీఎల్ ఓనర్లకు బిగ్ రిలీఫ్.. నిర్ణయం మార్చుకున్న విదేశీ బోర్డ్స్!
అందుకే భారత్ వంటి దేశాలు క్రిప్టో కరెన్సీలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలని కూడా ముందునుంచే చెబుతున్నాయి. పాకిస్థాన్ లాంటి ఉగ్రదేశాలు క్రిప్టో కరెన్సీలకు కేంద్రంగా మారితే పరిస్థితులు దారుణంగా ఉంటాయనే ఆరోపణలు వస్తున్నాయి.
national-news | crypto-currency