Pakistan Army: మళ్లీ తెగబడ్డ పాక్.. సరిహద్దుల్లో కాల్పులు!

సరిహద్దుల్లో పాకిస్థాన్ ఆర్మీ దాడులకు పాల్పడుతూనే ఉంది. నిన్న అర్థరాత్రి కూడా కుప్వారా, బారాముల్లా, అఖ్నూర్ సెక్టార్‌లో పాక్ కాల్పులకు పాల్పడినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. అయితే ఈ కాల్పులను భారత్ ఆర్మీ సమర్థంగా తిప్పికొట్టింది.

New Update
pak

BLA

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పాక్ కయ్యానికి కాలు దువ్వుతున్నట్లు ప్రవర్తిస్తుంది. సరిహద్దుల్లో పాకిస్థాన్ ఆర్మీ దాడులకు పాల్పడుతూనే ఉంది. నిన్న అర్థరాత్రి కూడా కుప్వారా, బారాముల్లా, అఖ్నూర్ సెక్టార్‌లో పాక్ కాల్పులకు పాల్పడినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. అయితే ఈ కాల్పులను భారత్ ఆర్మీ సమర్థంగా తిప్పికొట్టింది. సరిహద్దులో పాక్ సైన్యం రోజూ కూడా దాడులకు పాల్పడుతోంది. 

ఇది కూడా చూడండి: Russia: రష్యా సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటన

ఇది కూడా చూడండి:Waqf Board Assets: వక్ఫ్‌ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ.. కేంద్రం కీలక ప్రకటన

పూంఛ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి..

ఇదిలా ఉండగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నాలుగో రోజు కూడా పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పూంఛ్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది. అర్థరాత్రి సమయంలో కుప్వారా, పూంఛ్‌ జిల్లాల్లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ సైన్యం కాల్పులకు పాల్పడింది. వీటికి భద్రతా బలగాలు తక్షణమే స్పందించి శత్రువుల దాడిని తిప్పికొట్టాయని భారత సైన్యం వెల్లడించింది. 

ఇది కూడా చూడండి: Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు