/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Indian-Army-TGC-jpg.webp)
army
పహల్గామ్ ఉగ్రదాడి క్రమంలో దేశంలో ఉన్న పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేసినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. సెలవులపై వెళ్లిన జవాన్లు కూడా వెంటనే రిపోర్ట్ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అన్ని మిలిటరీ విభాగాల్లో జమ్మూకశ్మీర్లో ఉండే పరిస్థితులపై ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. అలాగే శ్రీనగర్లోని విమానాశ్రయంలో సైన్యం భద్రతను కూడా పెంచారు. ఉగ్రవాదుల కోసం వేట మొదలు పెట్టారు. అలాగే జమ్మూకశ్మీర్లో పరిస్థితిని చూడటానికి భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేదీ కశ్మీర్లో పర్యటించనున్నారు.
ఇది కూడా చూడండి: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?
Holidays got cancelled for defense people for 10 days and all persons who is in leave are calling back. Something is happening
— Charan Varma ™ (@Varma_Tweetz) April 24, 2025
ఇది కూడా చూడండి: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన
కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని..
జమ్మూకశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. స్టీల్ టిప్డ్ బుల్లెట్లు, AK-47 రైఫిళ్లు, బాడీ కెమెరాలు ధరించిన నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల బృందం హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి జమ్మూ కాశ్మీర్ సందర్శించడానికి వెళ్లిన పర్యాటకులు మృతి చెందారు. అయితే ఈ ఉగ్రవాదులలో ఇద్దరు స్థానికులు కూడా ఉన్నారు.
ఇది కూడా చూడండి: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?