/rtv/media/media_files/2025/04/24/USQYVhPGVglf9aL7JSs1.jpg)
Shimla Agreement
కాశ్మీర్ లో ఉగ్రదాడికి భారత్ రగిలిపోతోంది. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన టెర్రరిస్టులకు, పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలని గట్టిగా డిసైడ్ అయింది. ఇందులో భాగంగా సర్జికల్ స్ట్రైక్ కంటే ఎక్కువ ఎఫెక్ట్ చూపే ఐదు కీలక నిర్ణయాలను తీసుకుంది. పాకిస్తాన్ ను అన్ని విధాలా దిగ్భంధనం చేసింది. దీంతో ఏం చేయాలో తెలియక పాకిస్తాన్ భారత్ దారిలోనే నడిచింది. వాళ్ళు కూడా దౌత్యపరమైన నిర్ణయాలను తీసుకున్నారు. అందులో ఒకటి సిమ్లా ఒప్పందం రద్దు. అసలు ఈ సిమ్లా ఒప్పందం ఏమిటి? దీనిలోని నిబంధనలు ఏమిటి? దీని రద్దు వల్ల భారత్, పాక్ సంబంధాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఈ నిర్ణయంతో ఇరు దేవాల మధ్యా యుద్ధం కచ్చితంగా జరుగుతుందా..
1972లో కుదుర్చుకున్న ఒప్పందం...
1972 జూలై 2న భారత్, పాకిస్థాన్ మధ్య సిమ్లాలో కుదిరిన చారిత్రక ఒప్పందం ఇది. 1971లో ఇండియా-పాక్ మధ్య యుద్ధం జరిగింది. దాని తరువాత రెండు దేశాల మధ్యనా మామూలు వాతావరణం తీసుకువచ్చేలా సిమ్లా ఒప్పందాన్ని చేసుకున్నారు. దీనిపై అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ, పాకిస్థాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాల మధ్య ఉన్న అన్ని వివాదాలను, సమస్యలను శాంతియుత మార్గాల ద్వారా.. ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అంగీకరించాయి. మూడో దేశం లేదా పక్షం ప్రమేయం లేకుండా సమస్యలను పరిష్కరించుకోవాలనేది భారతదేశం ముఖ్య ఉద్దేశం. అంతేకాదు యుద్ధం టైమ్ లో భారత్, పాక్ ఆక్రమించుకున్న ప్రదేశాల నుంచి తమ సైనిక బలగాలను వెనక్కు రప్పించడం కూడా ఇందులో ఉంది. అలాగే 1971 యుద్ధం తర్వాత ఏర్పడిన ఎల్వోసీ సరిహద్దు రేఖను ఇరు దేశాలు గౌరవించాలని, ఎవరూ దీన్ని దాటకూడదని అనుకున్నారు. సిమ్లా ఒప్పందంలో ఇది అన్నింటికంటే ముఖ్యమైనది.
ఇప్పుడు దీని రద్దుతో పర్యవసానాలు..
సిమ్లా ఒప్పందం రద్దుతో అతి ముఖ్యమైన ఎల్వోసీ సరిహద్దు రేఖకు కట్టుబడి ఉండడం ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారుతుంది. ఇన్నాళ్ళు దీనిని స్ట్రిక్ట్ గా అమలు చేశారు కాబట్టే ఇరు దేశాల్లో శాంతి నెలకొంది. ఇప్పుడు కనుక ఇది లేకపోతే విచ్చలవిడిగా ఎవరికి వారు బార్డర్ ను దాటేయొచ్చు. ఇది సైనిక సంఘర్షణలకు దారి తీస్తుంది. అంతకంటే ముఖ్యంగా యుద్ధం సంభవిస్తుంది. ఇవన్నీ తెలిసే పాకిస్తాన్ ప్రభుత్వం సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంది అంటే భారత్ ను కచ్చితంగా యుద్ధానికి ఆహ్వానిస్తున్నట్టే అని చెబుతున్నారు. దాంతో పాటూ కశ్మీర్ లేదా ఇతర సమస్యల పరిష్కారం కోసం పాకిస్థాన్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వాన్ని కోరే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకు భారత్ ఒప్పుకోవాలి. మన దేశం కనుక అంతర్జాతీయ మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకోకపోతే ఎవరూ ఏం చేయలేరు. కానీ యుద్ధం, చొరబాట్ల విషయంలో మాత్రం ఇండియా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే.
today-latest-news-in-telugu | india | pakistan | shimla | agreement