Schools Closed: భారత్ - పాక్ యుద్ధం ఎఫెక్ట్.. పాఠశాలలన్నీ బంద్

భారత్-పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలో పలు ప్రాంతాల్లో స్కూల్స్ మూతపడ్డాయి. గుర్గావ్‌, చండీగఢ్, జమ్మూకాశ్మీర్‌లోని అన్ని పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలను రెండురోజుల పాటు మూసివేశారు. ఆదేశాలు వచ్చేవరకు ఇవన్నీ క్లోజ్ అయ్యే ఉంటాయి.

New Update

పాకిస్తాన్ గురువారం రాత్రి భారత్ సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు యత్నించింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లోని భారత సైనిక స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులను పంపడం ద్వారా శత్రుత్వాన్ని మరింత పెంచింది. పాక్ ప్రయత్నాలన్నింటినీ ఇండియన్ ఆర్మీ విజయవంతంగా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యగా భారత సరిహద్దు ప్రాంతాలలో హై అలెర్ట్ ప్రకటించారు. 

Also Read :  జమ్మూ లో దుమ్ము దులుపుతున్న భారత్ ఆర్మీ.. 8 మిస్సైళ్లను పేల్చేసిన S- 400

స్కూల్స్ క్లోజ్

ఇందులో భాగంగానే పలు పాఠశాలలను క్లోజ్ చేశారు. భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో.. ఇప్పటికే పంజాబ్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు మూసివేశారు. పంజాబ్ ప్రభుత్వం గురువారం అన్ని విద్యా సంస్థలను రాబోయే మూడు రోజులు మూసివేయాలని ఆదేశించింది. అదే సమయంలో పోలీస్ సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. తాజాగా మరికొన్ని స్కూల్స్ మూతపడ్డాయి. పాక్‌తో వార్ మరింత ముదురుతున్న తరుణంలో.. ముందు జాగ్రత్త చర్యగా.. గుర్గావ్‌లోని జిల్లా యంత్రాంగం గురువారం రాత్రి పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. 

Also Read :  ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. మ్యాచ్ రద్దు

ఈ మేరకు తల్లిదండ్రులకు పాఠశాల అధికారుల నుండి ఇదే విషయాన్ని తెలియజేస్తూ సందేశాలు వెళ్లాయి. అలాగే చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంలో అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యగా కేంద్ర పాలిత ప్రాంతంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను రెండు రోజుల పాటు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇది కూడా చూడండి: IND PAK WAR 2025: జైసల్మేర్‌లో 70కి పైగా డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!

రాజస్థాన్ ప్రభుత్వం.. అంతర్జాతీయ సరిహద్దు దగ్గర మోహరించిన పరిపాలనా,  పోలీసు సిబ్బంది సెలవులను రద్దు చేసింది. అదే సమయంలో ఐదు సరిహద్దు జిల్లాలు.. శ్రీ గంగానగర్, బికనీర్, జోధ్‌పూర్, జైసల్మేర్, బార్మెర్‌లో పాఠశాలలను మూసివేసింది. కాగా దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో కూడా భారత ప్రభుత్వం భద్రతను పెంచింది. అక్కడ త్వరలో పాఠశాలలు క్లోజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

 

operation Sindoor | jammu | Jammu Airport Attack | ind pak war | schools-holiday | schools-closed

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు