/rtv/media/media_files/2025/05/08/jO9znb8ejgKZ719t7f3z.jpg)
sindoori
ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్పై భారత్ నిర్వహించిన వైమానిక దాడి సామాన్య ప్రజల హృదయాలను తాకుతోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు నిర్వహించిన ఈ ప్రత్యేక ఆపరేషన్ పట్ల దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతోంది. భారత సైన్యాన్ని ప్రజలు హృదయపూర్వకంగా ప్రశంసిస్తున్నారు. ఈ దేశభక్తి భావనతో ప్రేరణ పొంది బీహార్ రాష్ట్రంలోని కతిహార్ జిల్లాలోని బాలతి మహేశ్పూర్ నివాసితులైన సంతోష్ మండల్, రాఖీ కుమారి తమ నవజాత కుమార్తెకు "సిందూరి" అని పేరు పెట్టారు. ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన రోజు తమ ఇంట్లో లక్ష్మీ దేవి జన్మించిందని చెప్పారు. ఈ క్షణాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావించి, ఈ చారిత్రాత్మక దినాన్ని తమ కుమార్తె పేరుతో ముడిపెట్టామని తెలిపారు. పాకిస్తాన్పై విజయం సాధించిన రోజు కూతురు పుట్టడం తమ కుటుంబానికి గర్వకారణమని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Also Read : ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
Also Read : యుద్ధం కారణంగా ఎగ్జామ్స్ క్యాన్సిల్.. క్లారిటీ ఇచ్చిన UGC
అమాయకపు టూరిస్టులును
పహల్గామ్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మతం పేరిట అమాయకపు టూరిస్టులును బలితీసుకున్నారు. కళ్లముందే తమ భర్తలను చనిపోవడం చూసి చాలామంది వివాహితలు కన్నీళ్లు పెట్టుకున్నారు. వారిలో గురుగ్రామ్కు చెందిన హిమాన్షి నర్వాల్ కూడా ఉన్నారు, ఆమె ఏప్రిల్ 16న వివాహం చేసుకుంది. ఆమె తన భర్త లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్తో కలిసి హనీమూన్కు వెళ్లింది, కానీ ఉగ్రవాదులు వినయ్ను దారుణంగా చంపారు. అదేవిధంగా జైపూర్కు చెందిన ప్రియాంక శర్మ భర్త రోహిత్ తో కలిసి హనీమూన్ జరుపుకోవడానికి పహల్గామ్ వెళ్ళింది. ఈ దాడిలో రోహిత్ పై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన ప్రియాంకను శ్రీనగర్లోని ఆసుపత్రిలో చేర్చారు. దానికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ను ప్రారంభించాయి. ఈ ఆపరేషన్ బుధవారం తెల్లవారుజామున 1:05 నుండి 1:30 గంటల మధ్య పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడిచేశాయి. ఈ దాడిలో దాదాపుగా 90 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.
Also read : Spy Drone: లాహోర్లో పేలుళ్లు..భారత గూఢచారి డ్రోన్ను కూల్చివేసిన పాక్ !
Also Read : పాకిస్తాన్ కొంపముంచిన చైనా.. పాక్ సరిహద్దులో డ్రాగెన్ సరుకు ఫెయిల్
telugu-news | pakistan | Sindoori | bihar | operation Sindoor