/rtv/media/media_files/2025/05/08/Rup3BPyeXojTUZt5hLU1.jpg)
india drone
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తరువాత ఇండియా, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా గురువారం ఉదయం లాహోర్లోని వాల్టన్ రోడ్డులో వరుస పెద్ద పేలుళ్లు వినిపించాయి. వాల్టన్ విమానాశ్రయం సమీపంలో భారతీయ డ్రోన్ను కూల్చివేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. 5 నుండి 6 అడుగుల పొడవున్న ఈ డ్రోన్ను సరిహద్దు అవతల నుండి నడుపుతున్నట్లు వారు తెలిపారు. వాల్టన్ విమానాశ్రయం సమీపంలోని పేలుళ్లు సంభివించడంతో వెంటనే ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Also Read : కుప్పకూలిన హెలికాప్టర్.. ఐదుగురు స్పాట్ డెడ్
Indian drone shot down near Old Airport Walton Road Lahore.
— Faraz Pervaiz (@FarazPervaiz3) May 8, 2025
Police sources say it was 5–6 feet long, operated from across the border & meant to spy on sensitive sites.
The #drone was jammed & brought down. pic.twitter.com/29Y4YYYFQC
Also Read : ‘35 ఏళ్లు అయింది..ఆ ఉంగరం, చేప ఎక్కడ ? రామ్ చరణ్, చిరంజీవి వీడియో వైరల్ !
సున్నితమైన ప్రదేశాలపై నిఘా
సున్నితమైన ప్రదేశాలపై నిఘా పెట్టడానికి భారత ఈ డ్రోన్ను ఎగురవేసినట్లుగా పాక్ మీడియా తెలిపింది. పేలుడు పదార్థాలను మోసుకెళ్లే ఈ డ్రోన్ భవనానికి చాలా దగ్గరగా చేరుకుందని తెలిపాయి. మరోవైపు , లాహోర్, సియాల్కోట్లోని అనేక కీలక విమాన మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా ఈ వాణిజ్య విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. గురువారం ఉదయం ప్రారంభమైన ఈ మూసివేతలు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు అమలులో ఉంటాయి.
కాగా పహల్గాం ఉగ్రదాడి తరువాత పాక్ తో సంబంధాలు తెంచుకున్న భారత్... ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించాయి. ఈ ఆపరేషన్ తెల్లవారుజామున 1:05 నుండి 1:30 గంటల మధ్య పాకిస్తాన్లోని తొమ్మిది నిర్దిష్ట ప్రదేశాలపై దాడిచేశాయి. ఈ దాడిలో దాదాపుగా 90 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.
Also read : Pakistan : పరువు పోయిందిగా.. అంతర్జాతీయ మీడియా ముందు పాక్ నవ్వుల పాలు
Also Read : LOC వెంబడి కాల్పులు జరిపిన పాక్ ఆర్మీ.. తిప్పికొట్టిన భారత్!
telugu-news | Walton Airport | Indian spy drone | Explosions