UGC: యుద్ధం కారణంగా ఎగ్జామ్స్ క్యాన్సిల్.. క్లారిటీ ఇచ్చిన UGC

యుద్ధవాతావరణం కారణంగా పరీక్షలు రద్దు చేశామని వస్తున్న వార్తలపై UGC క్లారిటీ ఇచ్చింది. ఎగ్జామ్స్ క్యాన్సిల్ అని ఫేక్ పబ్లిక్ నోటీస్ వైరల్ అవుతుంది. అలాంటి నిర్ణయం ఏం తీసుకోలేదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అధికారులు తేల్చి చెప్పారు.

New Update
UGC

ఇండియా, పాక్ మధ్య హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహించే పరీక్షలు రద్దు చేశారని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. పబ్లిక్ నోటీస్ అని ఓ సర్కులేషన్ వైరల్ అవుతుంది. అయితే వీటిపై యూజీసీ క్లారిటీ ఇచ్చింది. యుద్ధ పరిస్థితి కారణంగా అన్ని పరీక్షలు రద్దు చేయబడ్డాయి. విద్యార్థులు ఇంటికి తిరిగి వెళ్లాలని సూచిస్తూ UGC పేరుతో ఒక ఫేక్ పబ్లిక్ నోటీసును షేర్ చేస్తున్నారని UGC తెలిపింది. ఇలాంటి ఆదేశాలు ఏవీ ఇవ్వలేదని పరీక్షలు యథాతదంగా జరుగుతాయని ఎక్స్‌లో పేర్కొంది. ఈ మేరకు ఫేక్ నోటీస్‌పై క్లారిటీ ఇస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టింది. 

Also read: BREAKING: కుప్పకూలిన హెలికాప్టర్‌.. ఐదుగురు స్పాట్ డెడ్

Also Read :  ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

UGC Clarifies Reports Of Exams

అధికారిక సమాచారం ఎదైనా ఉంటే అఫీషియల్ వెబ్‌సైట్‌లో పెడతామని తెలిపింది. UGC వెబ్‌సైట్, సోషల్ మీడియా అకౌంట్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అటువంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి నేరమని అధికారులు హెచ్చరించారు. 

Also Read :  తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత!

Also Read :  పాక్‌ ఆర్మీ కాల్పులు.. భారత జవాన్ వీరమరణం

(exams | cancel | latest-telugu-news)

Advertisment
Advertisment