ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాలు క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ దేశాల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆపరేషన్ సిందూర్ను భారత్ పాక్పై చేపట్టడంతో యూరప్ పర్యటనను మోదీ రద్దు చేశారు. మే నెల మధ్యలో మళ్లీ ఈ పర్యటనను ప్లాన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా దీనికి ముందు మోదీ తన రష్యా పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ విజయం సాధించి 80 ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా మే 9న మాస్కోలో జరిగే విజయ దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ హాజరు కావడం లేదు.
ఇది కూడా చూడండి: Operation Sindoor : పాక్పై దాడుల వేళ...నేడు CCS తో ప్రధాని మోదీ కీలక భేటీ
PM Modi postpones Three nation Europe visit#PMModi #Europevisit pic.twitter.com/QoDQp0EusP
— Deccan Chronicle (@DeccanChronicle) May 7, 2025
ఇది కూడా చూడండి: BIG BREAKING : భారత్ దాడి చేసిన 9 ప్రాంతాలివే.. లష్కరే తోయిబా కంచుకోట ఖతం!
#BREAKING | After India's strike on Pak terror dens, PM Modi's 4-day Europe visit postponed@Rishabhmpratap shares more updates with @madhavgk #PMModi #OperationSindoor pic.twitter.com/avaa5govBt
— TIMES NOW (@TimesNow) May 7, 2025
ఇది కూడా చూడండి: BIG BREAKING : పాక్ దాడి.. ముగ్గురు భారత పౌరులు మృతి!
వ్యతిరేకంగా దాడులు చేస్తూ..
ఇదిలా ఉండగా.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రధాన చర్య తీసుకుంటూ మే 07వ తేదీ బుధవారం రాత్రి 1.30 గంటలకు 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడి చేసింది. ఈ దాడికి 'ఆపరేషన్ సిందూర్' అని పేరు పెట్టారు. భారత ఆర్మీ.. పాకిస్తాన్లోని 4 ప్రదేశాలను, పీఓకేలోని 5 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతోంది.అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ లోపు ఉన్న ఉగ్రవాదుల స్థావరాలను భారత్ టార్గెట్ చేసింది.
ఇది కూడా చూడండి: BIG BREAKING: పాక్ పై భారత్ మెరుపు దాడి.. 30కి పైగా ఉగ్రవాదులు హతం!