Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. ఎయిర్ ఇండియా ప్రయాణికులకు బిగ్ అలర్ట్

భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఎయిర్ ఇండియా ప్రయాణికులకు సూచనలు చేసింది. విమాన ప్రయాణాలు చేసే వారు 3 గంటల ముందే ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలని తెలిపింది. విమానం బయలు దేరడానికి 75 నిమిషాల ముందు చెక్ ఇన్ మూసి వేస్తారని ఎయిర్ ఇండియా వెల్లడించింది.

New Update

ఆపరేషన్ సింధూర్‌కి ప్రతీకారంగా పాకిస్థాన్ దేశంలోని సరిహద్దు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. మిసైళ్లు, డ్రోన్లు, ఫైటర్ జెట్లతో భారత్‌పై దాడికి దిగడంతో వెంటనే భారత సైన్యం వాటిని తిప్పికొట్టింది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగడంతో ఎయిర్ ఇండియా ప్రయాణికులకు సూచనలు జారీ చేసింది. ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారు మూడు గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలని సూచించింది. విమానం బయలు దేరడానికి 75 నిమిషాల ముందు చెక్ ఇన్ మూసి వేస్తారని ఎయిర్ ఇండియా తెలిపింది. 

ఇది కూడా చూడండి: IND PAK WAR 2025: జైసల్మేర్‌లో 70కి పైగా డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!

ఇది కూడా చూడండి: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

వైమానిక దాడుల కారణంగా..

వైమానిక దాడుల నేపథ్యంలో భద్రతా చర్యల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. విమానాశ్రయాలలో భద్రతా చర్యలను పెంచాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆదేశించింది. ఎయిర్‌పోర్టుకు వచ్చే ప్రతీ ఒక్కరూ కూడా గుర్తింపు పొందిన పత్రంతో పాటు ఫొటో తీసుకెళ్లాలని తెలిపింది. అలాగే చెక్ ఇన్ బ్యాగ్ కాకుండా హ్యాండ్ బ్యాగ్ కేవలం 7 కిలోల వరకు ఉన్నది మాత్రమే అనుమతి ఇస్తామని తెలిపింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రెండుసార్లు చెక్ చేసుకోవాలని అందుకే మూడు గంటల ముందు ఎయిర్‌పోర్టుకు రావాలని ఎయిర్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. 

ఇది కూడా చూడండి: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్‌లోకి తరలింపు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు