Ind-Pak War: పీఎం మోదీ ఇంటికి ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్..పాక్ అణు కుట్రపై చర్చ?

నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవల్ ప్రధని మోదీ నివాసానికి చేరుకున్నారు. పాకిస్తాన్ అణుబాంబు ప్రయోగించడంపై వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏం చేయాలా అన్న దానిపై వారివురూ చర్చలు చేయనున్నారని తెలుస్తోంది. 

New Update
india

PM Modi, NSA Ajith Dhoval

Ind-Pak War 2025

పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఈరోజు నేషనల్‌ కమాండ్‌ అథారిటీతో సమావేశం అవుతున్నారని అక్కడ మీడియా ప్రచారం చేస్తోంది. ఈ మీటింగ్ లో భారత్ పై అణు బాంబును ప్రయోగించే అవకాశాలు గురించి చర్చిస్తారని చెబుతున్నారు. మీడియాలో వస్తున్న ఈ విషయంపై భారత హై అథారిటీ అలెర్ట్ అయింది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవల్ ప్రధాని మోదీ ఇంటికి చేరుకున్నారు. ఒకవేళ పాకిస్తాన్ అణుబాంబు ప్రయోగం నిర్ణయం తీసుకుంటే భారత్ తక్షణ కర్తవ్యం ఏంటి అనే దానిపై అజిత్ ధోవల్, మోదీ చర్చించనున్నారని తెలుస్తోంది. న్యూ క్లియర్ వెపన్ అనేది చిన్న విషయం కాదు. ఎవరు దీన్ని ప్రయోగించినా నష్టం రెండు దేశాలకూ ఉంటుంది. దీని ఎఫెక్ట్ కొన్ని తరాలు నిలిచిపోతుంది. పాకిస్తాన్ తన ఆధిపత్యాన్ని చూపించడానికి బుద్ధిలేని నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనుకాడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఒక స్థిరమైన, దృఢమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 

 

Tags : today-latest-news-in-telugu | pm-modi | NSA Ajit Doval | meeting | india pakistan war 2025

Also Read: IND-PAK WAR: రాహుల్ గాంధీ వీడియోను లైవ్ లో చూపించిన పాక్ ఆర్మీ.. కొత్త స్కెచ్?

Also Read :  పాక్ దాడులను తిప్పికొట్టాం.. ఆర్మీ సంచలన ప్రెస్ మీట్!

Also Read :  బుద్ది మార్చుకోని పాక్.. భారత మహిళా పైలెట్ పట్టుబడ్డారంటూ ఫేక్ న్యూస్!

Also Read :  భారత్‌పై విషం కక్కుతున్న చైనా.. S-400 ధ్వంసం అయినట్లు ఫేక్ న్యూస్!

Advertisment
Advertisment
తాజా కథనాలు