/rtv/media/media_files/2025/05/31/aAXKMRUAN0iitILLRxT1.jpg)
Northeast Floods, Landslides Kills 19, Displace Over 12,000 Amid Heavy Rainfall
ఈశాన్య భారత్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అసోం, మిజోరాం, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ కుండపోత వర్షాలు కురిశాయి. ఈ వర్షాల ధాటికి నాలుగు రాష్ట్రాల్లో కూడా కొండ చరియలు విరిగిపడ్డాయి. వరదల్లో చిక్కుకొని 19 మంది మృతి చెందారు. పలు ప్రాంతాల్లో ఇళ్లు కొట్టుకుపోయాయి. ఏకంగా 12 వేల మంది నిరాశ్రయులయ్యారు. అరుణాచల్ప్రదేశ్పై వరదలు తీవ్ర ప్రభావం చూపించాయి.
Also Read: పాక్కు గూఢచర్యం..మరో ఇంటిదొంగ అరెస్ట్... భారత యుద్ధ నౌకల సమాచారం చేరవేసిన ఇంజినీర్
Also Read : మామిడి పండ్లను తినడానికి ముందు ఎందుకు నానబెట్టాలి? కారణాలు ఇవే!
Northeast Floods In India
పలుచోట్ల ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఇప్పటికే వాతావరణ శాఖ అసోంకు రెడ్ అలెర్ట్ను జారీ చేసింది. అలాగే మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: ప్రపంచం చూపులన్నీ HITEX మీదే! ఈరోజు గ్రాండ్ ఫినాలే హైలైట్స్ ఇవే
మరోవైపు జమ్మూకశ్మీర్లో కూడా ఉదయం కుండపోత వర్షం కురిసింది. రాంబన్ ప్రాంతంలో వడగండ్ల వాన, ఉధంపూర్లో ఓ మోస్తరు వర్షం కరిసింది. శ్రీనగర్లో కూడా శనివారం ఉదయం భారీ వర్షం కురిసింది. కొండచరియలు విరిగపడటం, ఆకస్మిక వరదలు వచ్చే ఛాన్స్ ఉందని జమ్ముకశ్మీర్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శనివారం పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొంది.
Also Read : రాజమౌళి 'SSMB29' పేరుతో రూ. 15.9 లక్షల మోసం! నిందితుడి కోసం పోలీసుల గాలింపు
rtv-news | Heavy Rains