మాఘి పూర్ణిమ స్పెషల్.. కుంభమేళాలో కొత్తగా మళ్లీ ట్రాఫిక్ ఆంక్షలివే

మహాకుంభమేళాలో ట్రాఫిక్ జామ్ వల్ల పోలీసులు కొత్త ట్రాఫికి ఆంక్షలు అమలు చేశారు. అవి ఫిబ్రవరి 11 నుంచే అమలు అవుతున్నాయి. ఫిబ్రవరి 12న మాఘి పూర్ణమి కావడంతో క్రౌడ్ పెరిగే అవకాశముందని ఈ నిర్ణయం తీసుకున్నారు. మరో పక్క యూపీలో 300 కిమీ మేర వాహనాలు నిలిచిపోయాయి.

author-image
By K Mohan
New Update
 prayagraj Maha Kumbh 2025

prayagraj Maha Kumbh 2025

 

ఇది కూడా చదవండి: వాళ్లు అప్లై చేసుకోవద్దు.. కొత్త రేషన్ కార్డు అప్లికేషన్లపై బిగ్ ట్విస్ట్!

మంగళవారం నుంచి ప్రయాగ్‌రాజ్ సిటీ బయటనే సందర్శకుల వాహనాలు పార్కింగ్ చేయాలని ట్రాఫిక్ ఆంక్షాలు పెట్టారు. ప్రయాగ్‌రాజ్‌ నుంచి సంగమం చేరుకోవడానికి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ వాడుకోవాలని, అక్కడి నుంచి నిర్ధేశించిన బార్కేట్ల ద్వారా ఘాట్లకు వెళ్లాని భక్తులకు సూచించారు. కొత్త ట్రాఫిక్ ఆంక్షలు మాఘి పుర్ణమికి కుంభమేళాకు వచ్చిన భక్తుల రద్దీ తగ్గేంతవరకు ఉంటాయని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 11 సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగ్‌రాజ్‌లో కాలినడకన నడిచే వారి కోసం నో వెహికల్ జోన్ నిబంధనలు అమలు చేశారు. టౌన్‌లోపలికి వాహనాలు అనుమతించకుండా.. పెద్ద పెద్ద పార్కింగ్ ప్లేస్‌లు ఏర్పాటు చేసి వాహనాలు అక్కడికి తరలించారు. ప్రయాగ్‌రాజ్‌ వైపు వచ్చే వాహనాలను దారి మళ్లించారు ట్రాఫిక్ పోలీసులు. మాఘి పూర్ణిమ స్నానం కోసం ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించాలనుకునే భక్తులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు కోరారు.

ఇది కూడా చదవండి: Ramarajyam Raghav Reddy : రామరాజ్యం రాఘవరెడ్డి నెక్ట్స్ టార్గెట్ చిన్నజీయర్ స్వామినా? వీడియోలు వైరల్

Advertisment
Advertisment
తాజా కథనాలు