TG New Ration Cards : వాళ్లు అప్లై చేసుకోవద్దు.. కొత్త రేషన్ కార్డు అప్లికేషన్లపై బిగ్ ట్విస్ట్!

తెలంగాణలో రేషన్‌కార్డు లేనివారు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మీ-సేవలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. ప్రజావాణి, ప్రజాపాలన, కుల గణనలో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది.

New Update
TS New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై కీలక అప్డేట్.. పేదలకు రేవంత్ సర్కార్ శుభవార్త!

TG New Ration Cards

TG New Ration Cards : తెలంగాణలో రేషన్‌కార్డు లేని వారు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మీసేవ కేంద్రాల్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవడంపై క్లారిటీ ఇచ్చింది. మీ-సేవ వెబ్‌సైట్‌లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని సివిల్‌ సప్లయిస్‌ భవన్‌లో సోమవారం మీసేవ అధికారులతో పౌరసరఫరాల శాఖ అధికారులు సమావేశమయ్యారు. ఈ సదర్భంగా రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించారు. 

ఇది కూడా చదవండి: రోజూ ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగారంటే ఈ సమస్యలన్నీ పరార్

ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా మీ సేవ కేంద్రాలలో కొత్త రేషన్ కార్డుల కోసం సోమవారం నుంచి  దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక రేషన్‌కార్డుల దరఖాస్తు కోసం మీసేవ వెబ్‌సైట్‌లో ‘మీ- దరఖాస్తుల స్వీకరణ’ ఆప్షన్‌ అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా రేషన్ కార్డులు లేని వారు ఏ సమస్యా లేకుండా మీ సేవ కేంద్రాల్లో కొత్త కార్డులకు దరఖాస్తులు చేసుకునేందుకు వీలు కలిగింది.

ఇది కూడా చదవండి: దగ్గు సిరప్ తీసుకున్న వెంటనే నీళ్లు తాగితే జరిగేది ఇదే

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, గ్యాస్‌, ఉచిత విద్యుత్‌ తదితర అంశాలపై దరఖాస్తులు స్వీకరించింది. అయితే అప్పుడు దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ప్రజాపాలనతో పాటు, కుల గణనలో గానీ దరఖాస్తు చేసుకున్నవారు మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Vande Bharat Train లో సిగరేట్ అంటించిన ప్యాసింజర్.. బోగీ అంతా పొగ-VIRAL VIDEO

తెలంగాణ కేబినెట్ నిర్ణయం మేరకు ‘ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వారికి రేషన్ కార్డులు మంజూరు చేస్తాం. కనుక మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు. ఒకే కుటుంబం మళ్లీ మళ్లీ దరఖాస్తు చేయడం వల్ల వారికి  సంబంధించిన వివరాలు పదే పదే చెక్ చేయాల్సి వస్తుంది. దీంతో అర్హులైన వారికి రేషన్ కార్డుల జారీలో మరింత జాప్యం తలెత్తే అవకాశం ఉందని’ సివిల్ సప్లైస్ అధికారులు తెలిపారు.

ఇది కూడా చూడండి: Uttarakhand:హీరోయిన్‌ను చేస్తామని.. మాజీ సీఎం కుమార్తెనే మోసం చేశారు!

రేషన్ కార్డుల కోసం మీ సేవ కేంద్రాల్లో ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తుండడంతో మీసేవ కేంద్రాల్లో జనం క్యూ కట్టారు. ప్రజలు భారీ సంఖ్యలో మీ సే కేంద్రాలకు తరలిరావడంతో మీ సేవ కేంద్రాల వద్ద భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. గత పదేళ్లలో రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం రాకపోవడం, కొన్ని రేషన్‌ కార్డుల్లో దొర్లిన తప్పులను సవరించుకునే అవకాశం లేకపోవడంతో చాలామందికి రేషన్‌కార్డులు లేవు. దీంతో పెద్ధ సంఖ్యలో జనం మీ సేవ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ నెలలో దరఖాస్తులు స్వీకరించి మార్చి మొదటివారంలో కార్డులు అందజేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇది కూడా చూడండి: Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం పై మగువ...బీజేపీ పెద్ద ప్లానే...నలుగురు ఎమ్మెల్యేలకు అవకాశం...!

Advertisment
Advertisment
తాజా కథనాలు