/rtv/media/media_files/HIeBNTWz39TjIE66rolk.jpg)
Vande Bharat
దేశంలో వందే భారత్ రైళ్ల సంఖ్య పెరుగుతోంది. అన్ని లైన్లలో కూడా వందే భారత్ రైళ్లు వేస్తున్నారు. అయితే ఈ రైలులో ప్రయాణించే ప్రయాణికులకు రైల్వే శాఖ భోజనం సదుపాయం కూడా కల్పించింది. వెజ్, నాన్ వెజ్ రెండు కూడా ఇచ్చేవారు. కానీ ఇకపై ఓ వందే భారత్ రైళ్లలో కేవలం వెజ్ ఫుడ్ను మాత్రమే ఇవ్వనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. న్యూఢిల్లీ నుంచి కత్రాలోని శ్రీ మాతా వైష్ణో దేవికి వెళ్లే వందే భారత్ రైలులో నాన్ వెజ్ను నిషేధించింది.
ఇది కూడా చూడండి: Horoscope Today:నేడు ఈ రాశివారికి అనుకున్నది ఒకటి..జరిగేది ఒకటి..సో జర భద్రం!
Lethal result of of Modi + #SudhaMurthi jugalbandi.
— Pallav B (@NanOratoR) February 2, 2025
Delhi-Katra #VandeBharat Express is India’s first fully #vegetarian train. Only vegetarian food is served to passengers. Also, passengers are prohibited from carrying non-vegetarian food/snacks onboard.https://t.co/ukZmV4XdTy
ఇది కూడా చూడండి: India vs England 5th T20I: టీమిండియా ఘన విజయం.. ఇంగ్లండ్ చిత్తు చిత్తు!
స్వచ్ఛమైన శాఖాహార భోజనం..
రైల్వే క్యాంటీన్లో వెజ్, నాన్వెజ్ ఫుడ్ తయారు చేసేటప్పుడు ఎలాంటి తారతమ్యం ఉండదు. దీంతో కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేయగా.. రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. వెజ్ కావాలని ఆర్డర్ చేసిన కూడా స్వచ్ఛమైన శాఖాహార భోజనం అందడం లేదని ఆరోపించారు. ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ పూర్తిగా నాన్ వెజ్ను నిషేధించింది.
ఇది కూడా చూడండి: Israel: నెతన్యాహు సతీమణి పై నేర విచారణ!
శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయం ఒక పవిత్రమైన ధార్మిక ప్రదేశం. జమ్మూ కశ్మీర్లోని కత్రాలో ఉన్న ఈ ఆలయానికి భక్తులు ఎక్కువగా వెళ్తుంటారు. ముఖ్యంగా వందే భారత్ రైలుకు వెళ్లడంతో మంసాహారం తీసుకురావడం వల్ల కొందరికి ఇబ్బంది వస్తుంది. అందుకే ఈ రైలులోకి మాంసాహారంతో ఉన్న స్నాక్స్ అన్ని కూడా నిషేధించారు.
ఇది కూడా చూడండి: Vasant Panchami : నేడు వసంత పంచమి.. బాసరకు పోటెత్తిన భక్తులు