Maharashtra: అలా చేశావేంటమ్మా.. చనిపోయాక ఏం జరుగుతుందని తెలుసుకునేందుకు బాలిక సూసైడ్..

మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు మహారాష్ట్రలో ఓ బాలిక (17) సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. బాలిక ఫోన్‌లో మరణం తర్వాత ఏం జరుగుతుంది? విదేశీ సంస్కృతుల గురించి ఎక్కువగా గూగుల్‌లో వెతికినట్లు పోలీసులు గుర్తించారు.

New Update
pune crime news

death

మనిషి చనిపోయాక కొందరు స్వర్గం లేదా నరకానికి వెళ్తుంటారని చెబుతారు. మరికొందరు వాటిని కొట్టి పారేస్తుంటారు. ఈ అంశంపై ఇప్పటికీ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఓ బాలిక (17) చేసిన పని అందరినీ షాక్‌కు గురిచేసింది. మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకనేందుకు ఆ బాలిక సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. ఈ విచిత్ర ఘటన మహారాష్ట్రంలో జరిగింది.   

Also Read: మహా కుంభమేళాలో హృదయ విదారక ఘటన.. తల్లిదండ్రులను వదిలేసిన కొడుకులు

ఇక వివరాల్లోకి వెళ్తే.. నాగ్‌పూర్‌కు చెందిన ఓ బాలిక ఇంటర్మీడియట్ చదువుతోంది. ఆమె ఇంట్లో సూసైడ్‌ చేసుకోవండంతో తన తల్లిదండ్రులు షాకైపోయారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ బాలిక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆమె తన ఫోన్‌లో మరణం తర్వాత ఏం జరుగుతుంది ? అలాగే విదేశీ సంస్కృతుల గురించి ఎక్కువగా గూగుల్‌లో వెతికినట్లు పోలీసులు గుర్తించారు.   

Also Read: ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు.. బీజేపీ సంచలన వ్యూహం

కొంతకాలం నుంచే ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు ప్లాన్ వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాదు ఆ బాలిక ఆన్‌లైన్‌ గేమింగ్‌కు కూడా బానిసైపోయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌లో ఓ కత్తిని కూడా ఆర్డర్ చేసుకుంది. ముందుగా తన చేయిని గాయపర్చుకుంది. ఆ తర్వాత మెడను కోసుకుని సూసైడ్ చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం దీనిపై మిగతా కోణాల్లో కూడా దర్యాప్తు జరుగుతోంది. 

Also Read: AI రంగంలో చైనా సంచలనం.. అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బే

Also Read: భారత జాలర్లపై శ్రీలంక నేవీ కాల్పులు.. తీవ్రంగా స్పందించిన విదేశాంగ శాఖ

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Kerala: 270 ఏళ్ళ తర్వాత అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మహా కుంభాభిషేకమ్

270 ఏళ్ళ తర్వాత కేరళ అనంత పద్మనాభస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకమ్ నిర్వహించారు. సుదీర్ఘంగా జరిగిన ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తయిన నేపథ్యంలో గర్భగుడి శిఖరంపై మూడు కలశాలను ప్రతిష్ఠించారు. అనంతరం విశ్వక్సేనుడి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు.

New Update
kerala

Padmanabha swamy temple

 కేరళలో అనంతపద్మనాభి స్వామి దేశాలయం ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. ఈ గుడి వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అందుకే 270 ఏళ్ళుగా దీన్ని మూసేశారు. అయితే రీసెంట్ గా ఆ ఆలయాన్ని మళ్ళీ తెరిచారు. దాంతో పాటూ 270 ఏళ్ళ తర్వాత అనంత పద్మనాభ స్వామి ఈరోజు మహాకుంభాభిషేకమ్ నిర్వహించారు. దీనిలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. సుదీర్ఘంగా జరిగిన ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తయిన నేపథ్యంలో గర్భగుడి శిఖరంపై మూడు కలశాలను ప్రతిష్ఠించారు. అనంతరం విశ్వక్సేనుడి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. ఈ విగ్రహం కూడా 300 ఏళ్ళ నాటిది. కటు సర్కార యోగం అనే పద్ధతిలో దీన్ని తయారు చేశారని చెబుతున్నారు.  ప్రధాన ఆలయ ఆవరణలోని తిరువంబడి శ్రీ కృష్ణ ఆలయం వద్ద అష్టబంధ కలశాన్ని ఉంచారు. 

ట్రావెన్ కోర్ కుటుంబం ప్రత్యేక పూజలు..

అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని కేరళలోని ట్రావెన్ కోర్ సంస్థానం చూస్తుంది. అందుకే కుంభాషేకం ముందు ఈ వంశానికి చెందిన మూలమ్ తిరునాల్ రామ వర్మ కుటుంబానికి చెందిన సభ్యులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేరళ గవర్నర్‌ విశ్వనాథ్‌ రాజేంద్ర అలేఖర్‌ కూడా హాజరయ్యారు. ఆలయం పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆదేశిస్తూ 2017లో సుప్రీం కోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచే ఆలయ బాగోగుల పనులు మొదలైనప్పటికీ కోవిడ్ కారణంగా అవి ఆగిపోయాయి. కోవిడ్ అనంతరం దశలు దశలుగా పని చేస్తూ ఇప్పటికి పూర్తి చేశారు. 

Also Read :  అనంతపురంలో ఇంటర్ విద్యార్థినీ దారుణ హత్య.. పెట్రోల్ పోసి కాల్చిన దుండగులు

Advertisment
Advertisment