/rtv/media/media_files/2025/01/18/cqRDJc4K18i7UpqzlvWe.jpg)
death
మనిషి చనిపోయాక కొందరు స్వర్గం లేదా నరకానికి వెళ్తుంటారని చెబుతారు. మరికొందరు వాటిని కొట్టి పారేస్తుంటారు. ఈ అంశంపై ఇప్పటికీ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఓ బాలిక (17) చేసిన పని అందరినీ షాక్కు గురిచేసింది. మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకనేందుకు ఆ బాలిక సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. ఈ విచిత్ర ఘటన మహారాష్ట్రంలో జరిగింది.
Also Read: మహా కుంభమేళాలో హృదయ విదారక ఘటన.. తల్లిదండ్రులను వదిలేసిన కొడుకులు
ఇక వివరాల్లోకి వెళ్తే.. నాగ్పూర్కు చెందిన ఓ బాలిక ఇంటర్మీడియట్ చదువుతోంది. ఆమె ఇంట్లో సూసైడ్ చేసుకోవండంతో తన తల్లిదండ్రులు షాకైపోయారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ బాలిక సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఆమె తన ఫోన్లో మరణం తర్వాత ఏం జరుగుతుంది ? అలాగే విదేశీ సంస్కృతుల గురించి ఎక్కువగా గూగుల్లో వెతికినట్లు పోలీసులు గుర్తించారు.
Also Read: ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు.. బీజేపీ సంచలన వ్యూహం
కొంతకాలం నుంచే ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు ప్లాన్ వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాదు ఆ బాలిక ఆన్లైన్ గేమింగ్కు కూడా బానిసైపోయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆన్లైన్లో ఓ కత్తిని కూడా ఆర్డర్ చేసుకుంది. ముందుగా తన చేయిని గాయపర్చుకుంది. ఆ తర్వాత మెడను కోసుకుని సూసైడ్ చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం దీనిపై మిగతా కోణాల్లో కూడా దర్యాప్తు జరుగుతోంది.
Also Read: AI రంగంలో చైనా సంచలనం.. అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బే
Also Read: భారత జాలర్లపై శ్రీలంక నేవీ కాల్పులు.. తీవ్రంగా స్పందించిన విదేశాంగ శాఖ