Crime: నువ్వేం తండ్రివి రా.. భార్య విడిచి వెళ్లిందనే కోపంతో ముగ్గురు పిల్లలను గొంతు కోసి హత్య

తమిళనాడులోని తంజావూర్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందనే కోపంతో భర్త తన ముగ్గురు పిల్లలను గొంతు కోసం చంపేశాడు.

New Update
A Man Strangles Mother, Hangs Her Body With Rope to Stage Suicide in Uttar Pradesh

Crime

తమిళనాడు(tamilnadu) లోని తంజావూర్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందనే కోపంతో భర్త తన ముగ్గురు పిల్లలను గొంతు కోసం చంపేశాడు(Father Killed Childrens). ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని మదుక్కూర్‌ సమీపంలో గోపాలసముద్రం ప్రాంతానికి చెందిన వినోద్‌కుమార్‌(38)కు నిత్య(34) అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వినోద్‌ కమార్ డ్రైవర్‌గా అలాగే ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. 

Also Read: మెడికల్ స్టూడెంట్ పై అత్యాచారం.. సీఎం సంచలన కామెంట్స్

Man Hacks 3 Kids To Death

ఈ దంపతులకు ఓవియా(12), కీర్తి(8), ఈశ్వరన్(5) ముగ్గురు పిల్లలున్నారు. అయితే నిత్యకు తిరువారూర్‌ జిల్లా మన్నార్‌కుడికి చెందిన ఓ వ్యక్తితో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. దీంతో ఆరు నెలల క్రితం ఆమె తన భర్త, పిల్లలను వదిలేసి ఆ వ్యక్తితో వెళ్లిపోయింది. కొన్నిరోజుల క్రితమే వినోద్‌ భార్యను కలిశాడు. ఇంటికి తిరిగి రావాలని కోరాడు. కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన వినోద్‌ శుక్రవారం పిల్లలకు స్వీట్లు ఇచ్చి తినాలని చెప్పాడు.  

Also Read: రాహుల్ గాంధీకి పట్టిన గతే తేజస్వీకి పడుతుంది.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

పిల్లలను వాటిని తింటుండగానే ఆ ముగ్గురు గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ చిన్నారులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత వినోద్ మదుక్కూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటన అక్కడ స్థానికంగా సంచలనం రేపింది. వినోద్ చేసిన పనిని అక్కడివారు తీవ్రంగా ఖండించారు. భార్య మీద కోపం పిల్లల మీద చూపించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: గ్రీన్ క్రాకర్స్ కు సుప్రీం గ్రీన్ సిగ్నల్..సిద్ధమవుతున్న ఢిల్లీ

Advertisment
తాజా కథనాలు