Maharashtra: ఛీ..ఛీ వీడు టీచరేనా.. క్లాస్‌లో గురకపెట్టి నిద్రపోతున్నాడు.. VIDEO

కొందరు టీచర్లు సరిగ్గా పాఠాలు చెప్పరు.. ఏకంగా క్లాస్‌రూమ్స్‌లోనే నిద్రపోతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రంలో జరిగింది. ఓ టీచర్‌ టేబుల్‌పై కాళ్లు పెట్టి మరి నిద్రపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Update
Maharashtra Teacher Naps, Snores For 30 Minutes In Class Full Of Children

Maharashtra Teacher Naps, Snores For 30 Minutes In Class Full Of Children

నేటి బాలలే రేపటి పౌరులు. వారికి సరైన విద్యాబుద్ధులు ఉంటేనే భవిష్యత్తులో వాళ్లు ఉన్నత స్థానాలకు చేరుతారు. వాళ్లకి అలాంటి లక్షణాలు నేర్పించి ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది. వాళ్లు సరిగ్గా పట్టించుకోకుంటే విద్యార్థుల చదువులు సక్రమంగా సాగవు. కొందరు టీచర్లు సరిగ్గా పాఠాలు చెప్పరు.. ఏకంగా క్లాస్‌రూమ్స్‌లోనే నిద్రపోతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రంలో జరిగింది. ఓ టీచర్‌ టేబుల్‌పై కాళ్లు పెట్టి మరి నిద్రపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.   

Also Read: ఇరాన్‌పై అమెరికా దాడులు.. అత్యంత సురక్షిత బంకర్‌లోకి ఖమేనీ

ఇక వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని జాల్నా జిల్లా గడేగావన్‌లో మరాఠీ మీడియా జిల్లా పరిషత్ పాఠశాల ఉంది. ఇందులో వీకే ముండే అనే వ్యక్తి టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఓ తరగతి గదిలో సుమారు 15 నుంచి 20 విద్యార్థులు కూర్చున్నారు. ఆ సమయంలో వీకే ముండే కూర్చిలో వెనక్కి వాలి, కాళ్లు బల్లపై పెట్టి గురక పెడుతూ నిద్రపోయారు. సుమారు 30 నిమిషాల పాటు అలాగే నిద్రలో మునిగిపోయారు. 

Also Read: అమెరికా దాడులకు మూల్యం చెల్లించుకోవాల్సిందే.. ఇరాన్ మంత్రి వార్నింగ్

చివరికీ స్కూల్‌లోని ఓ వ్యక్తి టీచర్ నిద్రపోవడాన్ని గమనించి వీడియో తీశారు. టీచల్ ఎంతసేపటి నుంచి నిద్రపోతున్నారని ఓ విద్యార్థిని అడగాడు. దీనికి ఆ విద్యార్థిని అరగంట మాస్టారు నిద్రపోతున్నారంటూ సమాధానం ఇవ్వడం వీడియోలో వినిపిస్తోంది. ఆ చప్పుడికి ఉపాధ్యాయుడు ఒళ్లు విరుచుకుంటూ నిద్ర లేచాడు. అనంతరం ఈ ఘటనపై జోనల్ విద్యాధికారికి ఫిర్యాదు చేయగా.. ఆయన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే టీచర్ నిద్రపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆ టీచర్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 

Also Read: భార్యను ఇంప్రెస్ చేద్దామనుకుంటే.. ఇరుక్కుపోయాడు

Advertisment
Advertisment
తాజా కథనాలు