/rtv/media/media_files/2025/01/23/dRgNIyBD6vV33JRzTuV6.jpg)
Maha Kumbhmela 2025
Maha Kumbhmela 2025: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిత్యం లక్షలాది మంది అక్కడికి వెళ్లి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భారత్తో పాటు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. అయితే తాజాగా యూపీ ప్రభుత్వం ఓ కీలక విషయం చెప్పింది. ఇప్పటివరకు త్రివేణి సంగమంలో 10 వేల కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని వెల్లడించింది.
Also Read : GHMC విస్తరణ .. ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వీలినం!
10 కోట్ల మందికి పైగా పుణ్య స్నానాలు..
కుంభమేళ ప్రారంభమైనప్పటి నుంచి గురువారం మధ్యహ్నం 12 గంటల వరకు జరిగిన పుణ్యస్నానాలపై ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. " కుంభమేళాలో రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. త్రివేణి సంగమంలో ఇప్పటిదాకా 10 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారని తెలిపింది. గురువారం నాడు మధ్యహ్నం వరకు 30 లక్షల మంది పుణ్యస్నానాలు చేసినట్లు చెప్పింది.
Also Read: ఐదేళ్లలో నిరుద్యోగం లేకుండా చేస్తా.. కేజ్రీవాల్ సంచలన హామీ
అయితే మకర సంక్రాంతి రోజున దాదాపు 3.5 కోట్ల మంది త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించారు. అలాగే 1.7 కోట్ల మంది పౌష్ పూర్ణిమ వేడుకకు హాజరయ్యారు. పండుగల వేళ స్నానాలు ఆచరించే ప్రదేశంలో భక్తుల సంఖ్యపై అధికారులు పరిమితులు విదించారు. మిగిలిన రోజుల్లో మాత్రం ఈ ఆంక్షలు ఉండవు. ఈ నేపథ్యంలోనే భారీగా భక్తులు తరలివస్తున్నారు. కుంభమేళ పూర్తయ్యే వరకు మొత్తం 45 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటివరకు 10 కోట్ల మందికి పైగా వచ్చినట్లు తెలిపింది.
Look at this!
— Erik Solheim (@ErikSolheim) January 18, 2025
Tens of millions of people are flocking to Prayagraj for the Kumbh Mela. The greatest human event on earth.
Such a vote for heart, spirit and faith in Humanity. ❤️❤️❤️
pic.twitter.com/2DYQfzbMNC
Also Read: చైనా మరో రికార్డ్.. 1000 సెకన్లపాటు ఆర్టిఫిషియల్ సన్
ఇదిలాఉండగా ఈ ఏడాది జనవరి 13న మహాకుంభమేళా మొదలైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26 వరకు అంటే మొత్తంగా 45 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. వివిధ దేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి భారీగా తరలివస్తున్నారు. అంతేకాదు కుంభమేళా వల్ల అక్కడ ఏకంగా 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాల కల్పన జరిగింది. హోటల్స్, ట్రావెలింగ్, ఇతర వ్యాపారాల వల్ల అనేక మందికి ఉపాధి దొరికింది. అలాగే అక్కడ తాత్కాలిక వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. దీంతో 1.5 లక్షల మంది నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి ఉపాధి అవకాశాలు లభించాయి.
Also Read : Maha kumbh mela: ఈసారి కప్ నమ్దే.. గంగాస్నానం చేసిన ఆర్సీబీ జెర్సీ