/rtv/media/media_files/2025/05/12/PT7X6epf3Kvbc4n3j45Z.jpg)
Difference Between S-400 And S-500 Missile System
రష్యా S-400 క్షిపణి వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది విమానం, క్షిపణులు, డ్రోన్లు వంటి వైమానిక దాడులను అడ్డుకోగలదు. గతనెలలో పాకిస్తాన్ భారత్పై చేసిన దాడులను S-400 సహాయంతో విజయవంతంగా తిప్పికొట్టాము. కానీ ఆ S400ని తయారు చేసిన రష్యా, ఉక్రేనియన్ డ్రోన్ దాడులను మాత్రం అడ్డుకోలేక పోయింది. రెండు రోజుల క్రితం ఉక్రెయిన్ రష్యా వైమానిక వ్యవస్థపై డ్రోన్ దాడులు చేసిన విషయం తెలిసిందే. వాటిని రష్యా సొంత డిఫెన్స్ అయిన S 400 తిప్పికొట్టలేక పోయింది. దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
2025 మేలో జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, లూథియానా, భుజ్ ఎయిర్ బేస్లపై పాకిస్తాన్ డ్రోన్, క్షిపణి దాడులను నిర్వహించింది. భారత వైమానిక దళం S-400 వ్యవస్థను ఉపయోగించి ఈ దాడులను పూర్తిగా తిప్పికొట్టింది. ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సమర్థవంతంగా పని చేసి 50కి పైగా పాకిస్తానీ డ్రోన్లు, క్షిపణులను నాశనం చేసింది. S-400 దాదాపు 600 కి.మీ దూరంలో ఉన్న దాడులను కూడా ట్రాక్ చేయగలదు. 400 కి.మీ వరకూ టార్గెట్ను అటాక్ చేస్తోంది. ఇండియన్ ఆర్మీ అవసరాలకు అనుగుణంగా S-400 టెక్నాలజీని మార్చుకుంది. కానీ రష్యా ఆ S 400ని కరెక్ట్గా వినియోగించుకోలేక ఇప్పటి వరకు అనేక సార్లు ఫెయిల్ అయ్యింది.
S-400తో రష్యా ఫెయిల్
2023 ఆగస్టులో ఉక్రెయిన్ క్రిమియాలో R-360 నెప్ట్యూన్ క్షిపణులు మరియు డ్రోన్లను ఉపయోగించి S-400 బ్యాటరీని ధ్వంసం చేసింది.
2023 అక్టోబర్లో ఉక్రెయిన్ ప్రత్యేక దళాలు బెర్డియాన్స్క్, లుహాన్స్క్లలో రెండు S-400 వ్యవస్థలను ధ్వంసం చేశాయి.
2024 ఏప్రిల్లో క్రిమియాలో ఉక్రెయిన్ నాలుగు S-400 లాంచర్లను, మూడు రాడార్లను, ATACMS క్షిపణులతో కూడిన వైమానిక నిఘా వ్యవస్థను ధ్వంసం చేసింది.
2024 జూన్లో ఉక్రేనియన్ HIMARS రాకెట్ బెల్గోరోడ్లోని S-400 వ్యవస్థను ధ్వంసం చేసింది.
2024 నవంబర్లో కుర్స్క్ ప్రాంతంలో ATACMS క్షిపణితో ఉక్రెయిన్ S-400ని లక్ష్యంగా చేసుకుంది.
2025 జనవరిలో ఉక్రేనియన్ HIMARS క్షిపణి S-400 96L6E రాడార్ను ధ్వంసం చేసింది.
ఉక్రెయిన్ ఇప్పటివరకు కనీసం 31 S-400 వ్యవస్థలను నాశనం చేసింది. ఇది రష్యాకు పెద్ద దెబ్బ, ఎందుకంటే ఒక్కో S-400 బ్యాటరీ ధర దాదాపు 200 మిలియన్ డాలర్లు అంటే ఇది ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 1,700 కోట్లు.
S-400 వైఫల్యానికి కారణాలు
అసమర్థ విస్తరణ: రష్యా తరచుగా స్వల్ప-శ్రేణి వైమానిక రక్షణ వ్యవస్థల (పాంట్సిర్ లేదా టోర్ వంటివి) మద్దతు లేకుండా S-400 ను ఒంటరిగా మోహరించింది. దీనివల్ల డ్రోన్లు వంటి తక్కువ ఎత్తులో ఎగురుతున్న లక్ష్యాలను అడ్డుకోలేక పోయింది.
ఉక్రెయిన్ వ్యూహం: S-400ను నాశనం చేయడానికి ఉక్రెయిన్ సంక్లిష్టమైన వ్యూహాన్ని అనుసరించింది. వారు మొదట డ్రోన్ రాడార్, యాంటీనాని టార్గెట్ చేసుకుంటారు. తరువాత క్షిపణులతో దాడి చేస్తారు.
ఎలక్ట్రానిక్ వార్ఫేర్: ఎలక్ట్రానిక్ వార్ఫేర్ (EW) పద్ధతులను ఉపయోగించి ఉక్రెయిన్ S-400 యొక్క రాడార్ సిగ్నల్ను జామ్ చేసింది. దీని వలన వ్యవస్థ లక్ష్యాలను ట్రాక్ చేయలేకపోయింది.
డ్రోన్ల సంఖ్య: ఉక్రెయిన్ వందలాది చౌకైన డ్రోన్లను ఉపయోగిస్తుంది, ఉదాహరణకు షాహెద్-136 లేదా DIY డ్రోన్లు, ఇవి S-400ని ఓవర్లోడ్ చేస్తాయి. మే 2025లో మాస్కోపై జరిగిన దాడిలో, వందలాది డ్రోన్లు S-400 నుండి తప్పించుకున్నాయి.
రష్యా నిర్లక్ష్యం: భారతదేశం చేసినట్లుగానే రష్యా S-400 ను రక్షించడానికి మభ్యపెట్టడం, తరచుగా తరలించడం లేదా నకిలీ వ్యవస్థలు వంటి చర్యలు తీసుకోలేదు. ఉక్రెయిన్ దీనిని సద్వినియోగం చేసుకుంది.
భారత్ S-400 విజయానికి కారణాలు
భారతదేశం గతంలో పెచోరా క్షిపణి వ్యవస్థతో చేసినట్లుగానే, దాని స్వంత సాంకేతికతతో S-400 ను అప్గ్రేడ్ చేసింది. డ్రోన్లు, తక్కువ ఎత్తులో వచ్చే ప్రమాదాలను అడ్డుకోవడానికి ఇండియా S-400తో పాటు స్వల్ప-శ్రేణి వ్యవస్థలు MANPADS, SHORADS వంటివి మోహరించింది. భారత సైన్యం S-400 ఆపరేటర్లకు విస్తృతమైన శిక్షణను అందిస్తుంది. దీనిని వ్యూహాత్మకంగా ఉంచారు. పాకిస్తాన్ పంపిన డ్రోన్లు 50 వరకే ఉన్నాయి. అదే ఉక్రెయిన్ వందలాది డ్రోన్లను ఉపయోగించింది. రష్యా వ్యవస్థలపై ఒత్తిడి తెచ్చింది.
s 400 missile | russia ukraine conflict | russia ukraine attack | russia ukraine crisis | war | S400 air defense missile | Indian Army Destroyed Pak Air Defence System | latest-telugu-news