/rtv/media/media_files/2025/04/24/sg5ICE5NINmL4AlJw3wQ.jpg)
Kashmiris' generosity during terror attacks, Free transport for tourists
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అక్కడున్న పర్యాటకులు భయంతో వణికిపోతున్నారు. దీంతో అక్కడి ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Also Read: ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ
పర్యాటకుల వద్ద ఎలాంటి రుసుం తీసుకోకుండానే ఉచితంగానే వాళ్ల గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. మరికొందరు స్థానికులు కూడా వాళ్లకు ఫ్రీగానే ఆశ్రయం కల్పిస్తున్నారు. అయితే దీనిపై ఓ ఆటో డ్రైవర్ మాట్లాడారు. '' ఇది కేవలం టూరిస్టుల మీద మాత్రమే జరిగిన దాడి కాదు. కశ్మీర్ ఆత్మపై జరిగినటువంటి దాడి. టూరిస్టులు మాకు అతిథులుగా వచ్చారు. ఉగ్రదాడి వల్ల ఇప్పుడు భయాందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితిని చూస్తే చాలా బాధగా అనిపిస్తోంది.
Also Read: హిమాచల్ ప్రదేశ్ లో హై అలెర్ట్..ఉగ్రదాడి జరగొచ్చనే హెచ్చరికలు
కొత్తగా పెళ్లైన ఓ జంట భయంతో వణుకుతూ నా దగ్గరికి వచ్చారు. ఎయిర్పోర్టుకు ఎలా వెళ్లాలని అడిగారు. దీంతో నేను వాళ్లని సురక్షితంగా దిగబెట్టాను. వాళ్లు నాకు డబ్బులిచ్చేందుకు యత్నించారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ల నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలి. అందుకే నేను తీసుకోలేదు. అలాగే ఆటో, ట్యాక్సి డ్రైవర్లందరం కూడా ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యా పర్యటకుల నుంచి డబ్బులు తీసుకోవడం లేదని'' ఆ ఆటో డ్రైవర్ తెలిపారు.
Also Read: టిఆర్ఎఫ్ ముసుగులో లష్కర్ ఈ తోయిబా దాడులు.. ఆన్లైన్లో యువకుల రిక్రూట్మెంట్!
Also Read: అఘోరీకి దిమ్మతిరిగే షాక్.. 10 ఏళ్లు జైల్లోనే - లాయర్ సంచలన వ్యాఖ్యలు
Short News | Latest News In Telugu | నేషనల్ TRF | rtv-news | national-news