/rtv/media/media_files/2025/04/24/Kp5XaHwPgZqJCDnQPJD5.jpg)
High Alert In Himachal Pradesh
కాశ్మీర్ లో పహల్గామ్ లోని బైసరన్ వ్యాలీలో దాడులు జరిగి రెండు రోజులు అవుతున్నా దాని నుంచి ఇంకా కోలుకోలేదు. యావత్ భారతదేశం శోక సంద్రంలో మునిగిపోయింది. ఉగ్రవాదుల మీద కోపంతో రగిలిపోతోంది. ఉగ్రవాదుల తలలు కావాలని దాడిలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. కేంద్రం కూడా ఈ ఉగ్రదాడిని తీవ్రంగా తీసుకుంది. ఇందులో భాగంగా నిన్న పాకిస్తాన్ మీద కఠిన చర్యలు తీసుకుంది. ఆ దేశంతో దౌత్యపరమైన సంబంధాలను క్యాన్సిల్ చేసుకున్నారు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేశారు.
Also Read: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్
Also Read : గౌతమ్ గంభీర్ను చంపేస్తామంటూ బెదిరింపులు
బార్డర్ దగగర హై సెక్యూరిటీ..
ఇదెలా ఉంటే టెర్రరిస్టుల కోసం భద్రతా బలగాలు తీవ్రంగా గాలిస్తున్నారు. కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వారిని గుర్తుపట్టారు. వారి ఫోటోల ఆధారంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులు ఇంకా దేశంలోనే ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పహల్గామ్ తరహాలో మరో ఉగ్రదాడి జరగొచ్చని అంటున్నారు ఇంటెలిజెన్స్ అధికారులు. హిమాచల్ ప్రదేశ్ లో దాడులకు తెగబడే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది. హిమాచల్ ప్రదేశ్ లో హై అలెర్ట్ ప్రకటించింది. సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు పోలీసులును ఆదేశించారు. ముఖ్యంగా జమ్ము, కాశ్మీర్ బార్డర్ ను పంచుకునే హిమాచల్ ప్రదేశ్ లోని చంబా, కంగ్రా జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. కాశ్మీర్ నుంచి పారిపోయిన ఉగ్రవాదులు హిమాచల్ ప్రదేశ్ వైపు రావొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
pahalgam terrorist attack | today-latest-news-in-telugu | himachal-pradesh | high-alert
Also Read : నీళ్ల నుంచి వ్యాపారం వరకు.. భారత్ నిర్ణయంతో పాక్ కు చుక్కలే.. ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటే?
Also Read : ఉగ్రదాడిలో ప్రమేయం లేకపోతే..పాక్ ఎందుకు ఉలికిపడుతోంది..డానిష్ కనేరియా