/rtv/media/media_files/2025/04/24/Ob1iz58Jpk3H4q4muK5K.jpg)
Karnataka Civil Court
కర్ణాటక (Karnataka) లో ఓ బాలుడు నిర్లక్ష్యంగా ఆటో నడిపి ఒకరి మృతికి కారణమయ్యాడు. 2021లో ఈ ఘటన జరిగింది. అయితే తాజాగా దీనిపై విచారించిన ఓ తాలుకా కోర్టు.. వాహన యజమానికి రూ.1.41 కోట్ల జరిమానా విధించింది. మరోసారి పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదనే హెచ్చరికలు చేస్తూ ఈ తీర్పునిచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. కొప్పళ జిల్లా యలబుర్గలో 2021లో ఓ 17 ఏళ్ల బాలుడు నిర్లక్ష్యంగా ఆటో నడిపాడు.
Also Read: ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ
Karnataka Civil Court Slaps Rs 1.41-Crore Fine
దీంతో రోడ్డు పక్కన వెళ్తున్న వాళ్లని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గంగావతిలోని జయనగర ప్రాంతానికి చెందిన రాజశేఖర్ అయ్యనగౌడ(48) అనే ఉద్యోగి.. మరికొందరు వ్యక్తులు తీవ్రంగా గాయాలపాలయ్యారు. వీళ్లని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే రాజశేఖర్ పరిస్థితి విషమించడంతో అతడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
Also Read: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్
దీంతో ఈ ఘటనపై మృతుడి భార్య చెనమ్మ గంగావతి.. తాలుక న్యాయ సేవా సమితిలో ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ కేసును జడ్జి రమేశ్ ఎస్.గాణిగెరె విచారించారు. బాలుడు నడిపిన ఆటో యజమానికి ఏకంగా రూ.1,41,61,580 జరిమానా విధించారు. బాలుడని తెలిసినా కూడా ఆటో ఎలా ఇస్తారని.. ఆ ఆటో యజమానిపై మండిపడ్డారు. రాజశేఖర్ కుటుంబంలో ముగ్గురికి సమానంగా ఈ డబ్బును పంచాలని అధికారులకు సూచనలు చేశారు.
Also Read: టిఆర్ఎఫ్ ముసుగులో లష్కర్ ఈ తోయిబా దాడులు.. ఆన్లైన్లో యువకుల రిక్రూట్మెంట్!
Also Read: పహల్గాంలో ఉగ్రదాడి.. తాలిబన్ల సంచలన ప్రకటన!
rtv-news | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu | breaking news in telugu | Karnataka Civil Court