/rtv/media/media_files/2025/05/06/mHVHTqGYsxoy50HjkIq8.jpg)
kanpur building fires five family members died
ఈ మధ్య అగ్నిప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీని కారణంగా ఎంతో మంది మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అలాంటి ఘోరమైన అగ్నిప్రమాదం ఒకటి ఉత్తర్ప్రదేశ్లో చోటుచేసుకుంది. కాన్పుర్లోని నాలుగంతస్తుల భవనంలో మంటలు భారీ స్థాయిలో చెలరేగాయి. దట్టమైన నల్లటి పొగతో ఆ ప్రాంతం అల్లకల్లోలంగా మారింది.
Also Read: ఛీ ఛీ.. అక్కవేనా నువ్వు..? సొంత చెల్లెళ్లని లవర్తో రేప్ చేయిస్తావా..!
ఒకే కుటుంబంలో 5గురు మృతి
ఈ మంటల్లో చిక్కుకుని ఓ కుటుంబం మొత్తం సజీవదహనం అయింది. మృతుల్లో భర్త, భార్యతోపాటు వారి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. నాలుగో అంతస్తులో నివాసముంటున్న భర్త మహ్మద్ డానిశ్(45), భార్య నజ్నీన్ శభ(42) దంపతులతో సహా వారి పెద్ద కుమార్తె సారా(15), మధ్య కుమార్తె సిమ్రా(12), చిన్న కుమార్తె ఇనయా(7) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కాగా షార్ట్సర్క్యూట్ కారణంగా మెల్లి మెల్లిగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత అవి కాస్త పెద్దవి కావడంతో ఇంట్లోని గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. దీంతో ప్రమాద తీవ్రత మరింత భారీ స్థాయిలో పెరిగింది.
Also Read: హైదరాబాద్ లేడీసా మజాకా.. బ్లౌజ్ ఆఫర్ చూడగానే పరుగో పరుగు - కిక్కిరిసిపోయిన షాప్
చమన్గంజ్ ప్రాంతంలో నాలుగు అంతస్తు భవనం ఉంది. ఆ అపార్ట్మెంట్ ఫస్ట్ అండ్ సెకండ్ అంతస్తుల్లో ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి. మిగిలిన రెండు అంతస్తుల్లో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. ఈ మంటలు చెలరేగిన వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది.
Also Read: గుండెపోటుకు అరటిపండుతో చెక్..రోజుకు 3 తినండి
ఇందులో భాగంగానే ఫైరింజన్లతో మంటలను అదులోకి తీసుకొచ్చారు. అనంతరం నాలుగో అంతస్తు నుంచి ఐదుగురి డెడ్ బాడీలను కిందికి తీసుకొచ్చి.. సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ వారు అప్పటికే చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. అయితే ఈ అగ్నిప్రమాదానికి గల కారణం ఏమై ఉంటుందా? అని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: తల నరికి.. బీజేపీ మహిళా నేత దారుణ హత్య!
telugu-news | latest-telugu-news | fire accident | crime news