దక్షిణాదిపై హిందీని, దేశంలో హిందూ మతాన్ని వ్యాప్తిచేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కమల్ హాసన్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం అనేవి దేశానికి రెండు కళ్ళు. వీటితోనే అభివృద్ధి చెందిన భారతదేశం అనే కలను సాధించగలమని నొక్కి చెప్పారు.
Kamal Haasan: దక్షిణాదిపై బలవంతంగా హిందీని రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని నటుడు, మక్కల్ నీధి మయం పార్టీ అధినేత కమల్ హాసన్ అన్నారు. డీలిమిటేషన్, భాషా వివాదంలో కేంద్రంపై తీవ్రంగా మాటల దాడి చేశారు. ఈ అంశంపై తన స్పష్టమైన వైఖరిని వెల్లడిస్తూ..'జనాభా పెరుగుదలను నియంత్రించడం కోసం జాతీయాభివృద్ధికి దోహదపడే రాష్ట్రాలను శిక్షించకూడదు' అని అన్నారు. ఆయన ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం భారతదేశానికి రెండు కళ్ళు. రెండింటికీ ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా మాత్రమే మనం సమ్మిళిత, అభివృద్ధి చెందిన భారతదేశం అనే కలను సాధించగలమని నొక్కి చెప్పారు.
హిందీని రుద్దేందుకు తపన..
ఈ మేరకు డీలిమిటేషన్ అంశంపై బుధవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. తమిళనాడు రాజకీయ పార్టీల అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన నాయకుడు కమల్ హాసన్.. తమిళనాడుతో సహా దేశంలోని దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ ద్వారా హిందీని రుద్దాలని కేంద్ర చూస్తోంది. హిందీ బెల్ట్ ప్రయోజనాలను ప్రోత్సహిస్తున్నాయి అని ఆరోపించారు. అంతేకాదు కేంద్రంపై కమల్ హాసన్ విమర్శలు గుప్పిస్తూ.. వారు హిందూ మతాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని దీనికి హిందీయా అనే పదాన్ని ఉపయోగించారు.
ఈశాన్య రాష్ట్రాలను సైతం ప్రభావితం..
పార్లమెంటరీ నియోజకవర్గాల పరిమితిని తగ్గించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా విమర్శించారు. ఇది భారతదేశ సమాఖ్య నిర్మాణం, వైవిధ్యానికి హాని కలిగిస్తుందని హెచ్చరించారు. భారతదేశ సమగ్ర దృక్పథాన్ని ప్రమాదంలో పడేస్తూ దానిని హిందూగా మారుస్తున్నారని అన్నారు. జనాభా ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన అంశం తమిళనాడుకు మాత్రమే ఆందోళన కలిగించే విషయం కాదు. ఇది ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పంజాబ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాలను కూడా ప్రభావితం చేస్తుందన్నారు.
ఈ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించినందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా అన్నారు. సైద్ధాంతిక విభేదాలను పక్కనపెట్టి చర్చల్లో పాల్గొనే తమిళనాడు పార్టీలను కమల్ హాసన్ ప్రశంసించారు. ఈ అవగాహనతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ చర్చలో రెండు కీలక సూత్రాలపై దృష్టి పెట్టాలి. ఒకటి ప్రజాస్వామ్యం మరొకటి సమాఖ్యవాదం. ఇవి రెండు కళ్ళు. రెండింటికీ ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా మాత్రమే మనం సమ్మిళిత, అభివృద్ధి చెందిన భారతదేశం కలను సాధించగలమన్నారు. మేము సమ్మిళిత భారతదేశాన్ని ఊహించుకుంటాం. కానీ వారు 'హిందీ'ని సృష్టించాలనుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో పదే పదే అంతరాయాలు కలిగించాల్సిన అవసరం లేదన్నారు.
కేంద్రం చర్య సమాఖ్యవాదాన్ని దెబ్బతీస్తుంది. ఇది పూర్తిగా అనవసరం. ఈ రోజు రేపే కాదు అన్ని సమయాల్లోనూ పార్లమెంటరీ ప్రతినిధుల సంఖ్యను మార్చకుండా ఉంచడం ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం. భారతదేశ వైవిధ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఒక భారతీయుడిగా నేను దీనిపై నొక్కి చెబుతున్నాను అన్నారు.
Kamal Haasan: హిందీ, హిందుమతమే వాళ్ల టార్గెట్.. మోదీ ప్రభుత్వంపై కమల్ సంచలన కామెంట్స్!
దక్షిణాదిపై హిందీని, దేశంలో హిందూ మతాన్ని వ్యాప్తిచేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కమల్ హాసన్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం అనేవి దేశానికి రెండు కళ్ళు. వీటితోనే అభివృద్ధి చెందిన భారతదేశం అనే కలను సాధించగలమని నొక్కి చెప్పారు.
Kamal Haasan sensational comments on Modi government
Kamal Haasan: దక్షిణాదిపై బలవంతంగా హిందీని రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని నటుడు, మక్కల్ నీధి మయం పార్టీ అధినేత కమల్ హాసన్ అన్నారు. డీలిమిటేషన్, భాషా వివాదంలో కేంద్రంపై తీవ్రంగా మాటల దాడి చేశారు. ఈ అంశంపై తన స్పష్టమైన వైఖరిని వెల్లడిస్తూ..'జనాభా పెరుగుదలను నియంత్రించడం కోసం జాతీయాభివృద్ధికి దోహదపడే రాష్ట్రాలను శిక్షించకూడదు' అని అన్నారు. ఆయన ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం భారతదేశానికి రెండు కళ్ళు. రెండింటికీ ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా మాత్రమే మనం సమ్మిళిత, అభివృద్ధి చెందిన భారతదేశం అనే కలను సాధించగలమని నొక్కి చెప్పారు.
హిందీని రుద్దేందుకు తపన..
ఈ మేరకు డీలిమిటేషన్ అంశంపై బుధవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. తమిళనాడు రాజకీయ పార్టీల అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన నాయకుడు కమల్ హాసన్.. తమిళనాడుతో సహా దేశంలోని దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ ద్వారా హిందీని రుద్దాలని కేంద్ర చూస్తోంది. హిందీ బెల్ట్ ప్రయోజనాలను ప్రోత్సహిస్తున్నాయి అని ఆరోపించారు. అంతేకాదు కేంద్రంపై కమల్ హాసన్ విమర్శలు గుప్పిస్తూ.. వారు హిందూ మతాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని దీనికి హిందీయా అనే పదాన్ని ఉపయోగించారు.
ఈశాన్య రాష్ట్రాలను సైతం ప్రభావితం..
పార్లమెంటరీ నియోజకవర్గాల పరిమితిని తగ్గించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా విమర్శించారు. ఇది భారతదేశ సమాఖ్య నిర్మాణం, వైవిధ్యానికి హాని కలిగిస్తుందని హెచ్చరించారు. భారతదేశ సమగ్ర దృక్పథాన్ని ప్రమాదంలో పడేస్తూ దానిని హిందూగా మారుస్తున్నారని అన్నారు. జనాభా ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన అంశం తమిళనాడుకు మాత్రమే ఆందోళన కలిగించే విషయం కాదు. ఇది ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పంజాబ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాలను కూడా ప్రభావితం చేస్తుందన్నారు.
Also read : సింగర్ కల్పన ఆత్మహత్యకు అదే కారణం.. షాకింగ్ విషయాలు
ఈ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించినందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా అన్నారు. సైద్ధాంతిక విభేదాలను పక్కనపెట్టి చర్చల్లో పాల్గొనే తమిళనాడు పార్టీలను కమల్ హాసన్ ప్రశంసించారు. ఈ అవగాహనతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ చర్చలో రెండు కీలక సూత్రాలపై దృష్టి పెట్టాలి. ఒకటి ప్రజాస్వామ్యం మరొకటి సమాఖ్యవాదం. ఇవి రెండు కళ్ళు. రెండింటికీ ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా మాత్రమే మనం సమ్మిళిత, అభివృద్ధి చెందిన భారతదేశం కలను సాధించగలమన్నారు. మేము సమ్మిళిత భారతదేశాన్ని ఊహించుకుంటాం. కానీ వారు 'హిందీ'ని సృష్టించాలనుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో పదే పదే అంతరాయాలు కలిగించాల్సిన అవసరం లేదన్నారు.
Also read : చైనా AI డీప్సీక్ కారణంగా మస్క్కు 90 బిలియన్ డాలర్ల నష్టం
కేంద్రం చర్య సమాఖ్యవాదాన్ని దెబ్బతీస్తుంది. ఇది పూర్తిగా అనవసరం. ఈ రోజు రేపే కాదు అన్ని సమయాల్లోనూ పార్లమెంటరీ ప్రతినిధుల సంఖ్యను మార్చకుండా ఉంచడం ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం. భారతదేశ వైవిధ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఒక భారతీయుడిగా నేను దీనిపై నొక్కి చెబుతున్నాను అన్నారు.