Mangalsutra: మహిళా న్యాయమూర్తి మంగళసూత్రం చోరీ..

ఉత్తరప్రదేశ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా న్యాయమూర్తి మెడలోని మంగళసూత్రాన్ని కొందరు ఆడ దొంగలు ఎత్తుకెళ్లడం కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు పదిమంది మహిళా దొంగలను అరెస్టు చేశారు.

New Update
Judge's mangalsutra snatched from Mathura temple in uttar Pradesh, 10 women thieves arrested

Judge's mangalsutra snatched from Mathura temple in uttar Pradesh, 10 women thieves arrested

ఉత్తరప్రదేశ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా న్యాయమూర్తి మెడలోని మంగళసూత్రాన్ని కొందరు ఆడ దొంగలు ఎత్తుకెళ్లడం కలకలం రేపింది. సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. పదిమంది మహిళా దొంగలను అరెస్టు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే యూపీలోని మధురలో ఈ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి ప్రేమా సాహు.. జూన్‌ 1న తన కుటుంబంతో కలిసి ఠాకూర్‌ రాధారామన్ ఆలయానికి వచ్చారు.  

Also read: భర్తతో కలిసి డ్యాన్స్ చేసిన మహువా మెయిత్రా.. వీడియో వైరల్

ఈ క్రమంలోనే కొందరు ఆడదొంగలు భక్తుల మాదిరిగా నటించారు. సమయం చూసి ఆ మహిళా న్యాయమూర్తి మెడలో నుంచి బంగారు తాళిబొట్టును అపహరించారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆలయం వద్ద భక్తుల రద్దీ ఉన్న నేపథ్యంలో చోరీలు, పిక్‌పాకెటింగ్‌కు పాల్పడే దొంగలను గుర్తించేందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. చివరికి శనివారం పదిమంది మహిళా దొంగలను అరెస్టు చేశారు. వాళ్లు చోరీ చేసిన పర్సులను స్వాధీనం చేసుకున్నారు.  

Also Read: ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడమే లక్ష్యం.. కొనసాగుతున్న భారత్, మంగోలియా సంయుక్త మిలటరీ డ్రిల్..

డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆధార్‌ కార్డులు, పాన్‌కార్డులు, డెబిట్‌ కార్డులు, ఇతర కీలక పత్రాలతో పాటు రూ.18,652 నగదు ఆ పర్సుల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌కు చెందిన మహిళలు ఇక్కడకు వచ్చి దొంగల ముఠాగా ఏర్పడ్డారని తెలిపారు. అరెస్టు చేసిన ఆ ఆడదొంగలను జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు.  

Also Read: రింకూ సింగ్, ప్రియా సరోజ్ ఎంగేజ్ మెంట్..అఖిలేష్ యాదవ్ సహా 300మంది అతిథులు

Also Read: సంబరాల్లో మునిగిపోయిన మంత్రి సురేఖ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?

 

Advertisment
Advertisment
తాజా కథనాలు