/rtv/media/media_files/2025/08/15/jammu-and-kashmir-cloudburst-deaths-cross-60-2025-08-15-13-35-54.jpg)
Jammu and kashmir cloudburst deaths cross 60
జమ్మూకశ్మీర్(Jammu And Kashmir) లోని కిశ్త్వర్లో గురువారం క్లౌడ్ బరస్ట్(Cloud Burst) సంభవించిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటన వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60కి చేరుకుంది. ఈ విషయాన్ని సీఎం ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. అలాగే మరో 100 మందికి గాయాలైనట్లు పేర్కొన్నారు. గల్లంతైన వారి ఆచూకి కోసం రెండోరోజు ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఫోన్ చేశారని.. ప్రస్తుత పరిస్థితుల గురించి ఆరా తీశారని పేర్కొన్నారు. మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. క్లౌడ్ బరస్ట్ జరిగిన ప్రాంతంలో అక్కడ దాదాపు 1200 మంది ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
Also Read: IAF రియల్ హీరో.. పాకిస్థాన్ జైలు నుంచి 2సార్లు తప్పించుకున్న వింగ్ కమాండర్ కథ!
Cloud Burst In Jammu & Kashmir
#BRORescueOperationLadakh
— 𝐁𝐨𝐫𝐝𝐞𝐫 𝐑𝐨𝐚𝐝𝐬 𝐎𝐫𝐠𝐚𝐧𝐢𝐬𝐚𝐭𝐢𝐨𝐧 (@BROindia) August 14, 2025
On 13 Aug, a cloudburst at Lamayuru blocked NH-1, stranding 60 LMVs and 30 HMVs including tourists.
Project VIJAYAK @BROindia braved rain, landslides and darkness, restoring trafficability by 14 Aug 0100 hrs and ensuring safe evacuation, including two… pic.twitter.com/pXjR8zczKs
ఇప్పటికే కిశ్త్వర్లో NDRF బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ప్రతికూల వాతావరణం ఉండటం వల్ల ఆ ప్రాంతానికి హెలికాప్టర్లు వెళ్లడం లేదని అధికారులు పేర్కొన్నారు. అందుకే రోడ్డు మార్గం ద్వారా సహాయక బృందాలు వెళ్తున్నాయని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు, స్థానిక స్వచ్ఛంద సంస్థలతో సహా మొత్తంగా 300 మంది సైనిక టీమ్ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యింది. అయితే ఇప్పటిదాకా దొరికిన మృతదేహాల్లో 21 మందిని గుర్తించామని అధికారులు చెప్పారు.
A massive cloudburst has struck the Chishoti area in Jammu & Kashmir’s Kishtwar, along the route to the Machail Mata Yatra.
— J&K Congress (@INCJammuKashmir) August 14, 2025
As per initial reports heavy losses are feared.
Our thoughts and prayers are with the victims, their families, and all those affected by this calamity. pic.twitter.com/fFP4860Gty
Also Read: అడుగడునా ప్రకృతి అందాలు.. 8.5 కిలో మీటర్ల నడక.. మచైల్ మాత యాత్ర ఎంత కష్టమంటే!?
ఇదిలాఉండగా జమ్మూకశ్మీర్లో గురువారం క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఒక్కసారిగా వరదలు పోటెత్తడంతో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే మచైల్ మాతా దేవి దర్శనానికి వెళ్తున్న యాత్రికులు కూడా దీని ప్రభావానికి మృతి చెందారు. పలు భవనాలు, దుకాణాలు కూడా కొట్టుకుపోయాయి. ఈ విషాద ఘటన నేపథ్యంలో మచైల్ మాతా దేవీ యాత్రను అధికారులు నిలిపివేశారు.