Delhi Bomb Blast: ఢిల్లీ బాంబు బ్లాస్ట్‌.. అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత

బీహార్‌ ఎన్నికలకు ఒకరోజు ముందు దేశ రాజధానిలో బాంబు దాడి జరగడం కలకలం రేపింది. ఈరోజు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో బీహార్‌ వెంట ఉన్న అంతర్జాతీయ సరిహద్దులను అధికారులు మూసివేశారు.

New Update
international borders closed amid delhi bomb blast incident

international borders closed amid delhi bomb blast incident

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు బ్లాస్ట్‌(Delhi Bomb Blast)లో 12 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. బీహార్‌ ఎన్నికలకు(Bihar elections) ఒకరోజు ముందు దేశ రాజధానిలో ఈ దాడి జరగడం కలకలం రేపింది. ఈరోజు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో బీహార్‌ వెంట ఉన్న అంతర్జాతీయ సరిహద్దులను అధికారులు మూసివేశారు. 72 గంటల వరకు ఈ మూసివేత కొనసాగుతుందని ఆ రాష్ట్ర డీజీపీ వినయ్ కుమార్ తెలిపారు. 

Also Read: ఢిల్లీ బ్లాస్ట్‌ వెనుక నలుగురు డాక్టర్ల కుట్ర.. వెలుగులోకి సంచలన విషయాలు!

Delhi Bomb Blast

ప్రస్తుతం బీహార్‌లో రెండో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల నాటికి 60.04 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో జన్‌సురాజ్‌ పార్టీ చీఫ్‌ ప్రశాంత్‌ కిశోర్‌, మాజీ సీఎం జితన్ రాం మాంఝీ ఓటు వేశారు.  ఈరోజు మొత్తం 20 జిల్లాల్లోని 122 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 3.70 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల కోసం 45 వేలకు పైగా పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. నవంబర్‌ 14న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఈసారి బీహార్‌లో ఎవరు అధికారంలోకి వస్తారనే దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 

Also Read: ఢిల్లీ బాంబు పేలుడు ఘటన.. దాడికి ముందు Redditలో స్టూడెంట్ పోస్ట్

ఇదిలాఉండగా ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడి ఘటన దేశాన్ని ఉలిక్కపడేలా చేసింది. ఈ క్రమంలో కేంద్ర హోం శాఖ.. ఈ బాంబు దాడి ఘటనను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో మరికొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించి వివరాలు బయటికి రానున్నాయి. మరోవైపు ఈ దాడిపై తాజాగా స్పందించిన ప్రధాని మోదీ.. ఈ దాడికి పాల్పడ్డ నిందితులను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టమని స్పష్టం చేశారు. 

Advertisment
తాజా కథనాలు