Indian Army: పాకిస్తాన్ మిస్సైల్‌ని గాల్లోనే పేల్చేసిన భారత్

ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగా పాకిస్తాన్ ఇండియాపైకి మిస్సైల్ దాడికి దిగింది. రాత్రి పంజాబ్‌లో అమృత్‌సర్ వద్ద క్షిపణితో అటాక్ చేసేందుకు పాక్ ప్రయత్నించింది. భారత్ యాంటి మిస్సైల్ వ్యవస్థ పాకిస్తాన్ మిస్సేల్‌ని గాల్లోనే ధ్వంసం చేసింది.

New Update
Pakistani missile

ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగా పాకిస్తాన్ ఇండియాపైకి మిస్సైల్ దాడికి దిగింది. పంజాబ్‌లోని అమృత్‌సర్ పరిసర ప్రాంతాల్లో క్షిపణితో అటాక్ చేసేందుకు గురువారం రాత్రి పాక్ ప్రయత్నించింది. యాంటి మిస్సైల్ వ్యవస్థ ద్వారా పాకిస్తాన్ మిస్సైల్‌ని గాల్లోనే ధ్వంసం చేసింది భారత్. అమృత్‌సర్ పరిసర ప్రాంతాల్లో పంటపొలాల్లో క్షిపణి శకలాలు లభ్యమైయ్యాయి. రష్యాకు చెందిన ఎయిర్ డిఫెన్స్ యాంటీ మిస్సైల్ పాక్ క్షిపణిని చిత్తు చేసింది. 

Also Read :  తిరుమలలో మరోసారి అపచారం

Indian Army Destroys Pakistani Missile

Also Read :  ఎలాంటి అంచనాలు లేకుండా భారీ విజయం.. ఈ వారం బెస్ట్ మూవీ సజెషన్ ఇదే!

 రష్యా నుంచి దిగుమతి చేసుకున్న S 400 రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ క్షిపణిని గాల్లోనే పేల్చేసింది. శుక్రవారం తెల్లవారుజామున 1,2 గంటల సమయంలో పాకిస్తాన్ సర్ఫేస్ టూ సర్ఫేస్ SMA క్షిపణిని పంజాబ్‌పై ప్రయోగించింది. దాన్ని విజయవంతంగా భారత్ తిప్పికొట్టింది. నిన్న రాత్రి ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. అందులో మసూర్ అజార్‌ ఫ్యామిలితోపాటు దాదాపు 80 మంది మరణించినట్లు సమాచారం.

గుజరాత్‌ కచ్ జిల్లాలోని ఇండియా-, పాకిస్తాన్ సరిహద్దులో అనుమానాస్పద పేలుడు సంభవించింది. అనుమానాస్పద డ్రోన్ హైటెన్షన్ విద్యుత్ లైన్‌ను ఢీకొట్టడంతో బ్లాస్ట్ అయ్యింది. ఆ డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చిందని భద్రతా బలగాలు దర్యాప్తు చేస్తున్నారు. గురువారం ఉదయం 6 గంటలకు ఖావ్డా ఇండియా బ్రిడ్జి సమీపంలో ఈ సంఘటన జరిగింది. 

Also Read :  రంగంలోకి కేఏ పాల్... పాకిస్తాన్‌తో చర్చలు.. యుద్ధం వద్దంటూ..!

Also Read :  ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

latest-telugu-news | destroys

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు