/rtv/media/media_files/2024/11/01/fo1JtU9nA4uwurdz1lwa.jpg)
TTD
తిరుమలలో మరోసారి అపచారం చోటు చేసుకుంది. ఈ రోజు ఆలయంపై విమానం చక్కర్లు కొట్టింది. ఆగమశాస్త్రానికి విరుద్ధంగా ఆలయంపై విమానాలు తిరగడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు స్పందించి తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 9 గంటల సమయంలో ఆలయంపై నుంచి విమానం వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి.. నిన్న పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ ప్రతిదాడి నేపథ్యంలో ఇప్పటికే తిరుమలలో బందోబస్తు కట్టుదిట్టం చేశారు. ఈ పరిస్థితుల్లో తిరుమల ఆలయంపై విమానాలు వెళ్లడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఏపీకి చెందిన రామ్మోహన్ నాయుడు ఉన్న విషయం తెలిసిందే. అయినా.. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
Also Read : అక్కడ కనిపిస్తే కాల్చివేయండి.. భారత్ ఆర్మీకి సంచలన ఆదేశాలు!
Also Read : ఆపరేషన్ సిందూర్.. అఖిలపక్ష భేటీలో మోదీ కీలక ప్రకటన
మరోసారి తిరుమల ఆలయం పై విమానం చక్కర్లు.
— RTV (@RTVnewsnetwork) May 8, 2025
ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా ఆలయంపై తిరుగుతున్న విమానాలు..#AndhraPradesh #tirumala #flights #RTV pic.twitter.com/jf6D42DVf6
(tirupati | telugu-news | telugu breaking news)