/rtv/media/media_files/2025/05/08/u4ixhnj0PCehMwf7z1e5.jpg)
ka-paul pakistan
రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇండియా, పాకిస్తాన్ మధ్య చర్చలు జరుపుతున్నట్లుగా ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. మే10వ తేదీ శనివారం ప్రధాని మోదీ, అమిత్ షాలను కలుస్తున్నానని, ఆదివారం పాకిస్తాన్ కు కూడా వెళ్తానని వెల్లడించారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను మూడు రోజుల పాటు రహస్యంగా అమెరికా వెళ్లి వచ్చానని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. యుద్ధం వద్దు.. శాంతే కావాలని తాను చెబుతున్నానని పాల్ వెల్లడించారు. ఇండియా కేవలం టెర్రరిస్టులను మాత్రమే టార్గెట్ చేస్తోందన్నారు.
ఆర్డీటీ పై బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్ కుట్రలు చేస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు. ఆర్డీటీకి ఏఫ్.సి.ఆర్.ఏ రెన్యూవల్ జరగకుండా ఆపారని అన్నారు. ఆర్డీటీకి ఏఫ్.సి.ఆర్.ఏ తీసుకొస్తా.. ఆపే ధైర్యం ఎవరికుందని పాల్ హెచ్చరించారు. ఆర్డీటీ ప్రతినిధులు తనను కలిసిన 30రోజుల్లో ఏఫ్.సి.ఆర్.ఏ తీసుకొస్తానని తెలిపారు.
జగన్ క్రిస్టియన్ కాదు
తిరుమల లడ్డూ వివాదం తీసుకొచ్చి హిందువులు, క్రిస్టియన్ల మధ్య గొడవలు సృష్టించారంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు హిందువులు, క్రిస్టియన్ల మధ్య గొడవలు సృష్టించారని మండిపడ్డారు. అసలు మాజీ సీఎం జగన్ క్రిస్టియన్ కానే కాదని సాక్ష్యాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడని వెల్లడించారు. నిన్నటి వరకు మోదీని చంద్రబాబు దారుణంగా తిట్టారని.. ఇప్పుడు అదే మోదీని విశ్వగురువు, మిసైల్ అంటున్నారని విమర్శి్ంచారు. ప్రధాని మోదీ బుర్ర పని చేయని మస్సైల్, మత కలహాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ తొత్తులు అని కేఏ పాల్ అన్నారు. మళ్లీ పాల్ అన్న పాలన రావాలి... పాలన మారాలని పిలుపునిచ్చారు. ఇక పాస్టర్ ప్రవీణ్ హత్య కేసు విచారణ చేయమంటే.. 5లక్షలు కట్టమన్నారని కేఏ పాల్ మండిపడ్డారు. హైకోర్టు సీజేకి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తెలుసా అని ప్రశ్నించారు. ఏదీ ఏమైనా పాస్టర్ ప్రవీణ్ ది ముమ్మాటికీ హత్యేనని కేఏ పాల్ స్పష్టం చేశారు.
Also Read : Hyderabad: తరుముకొచ్చిన మృత్యువు.. సాయం చేసిన వాడిని చంపేసిన కారు డ్రైవర్