పాక్‌కు భారత్ గట్టి దెబ్బ.. మొదలైన నీటి కష్టాలు.. ఫొటోలు ఇదిగో!

సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాక్‌లో నీటి కష్టాలు మొదలైనట్లు తెలుస్తోంది. పాక్‌లోకి ప్రవహించే చీనాబ్ నది నీటి ప్రవాహం తగ్గినట్లు శాటిలైట్ ఫొటోల్లో కనిపిస్తుంది. ఈ విషయాన్ని మిలిటరీ ఇంటెలిజెన్స్ కల్నల్ శాటిలైట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

New Update

జమ్మూకశ్మీర్‌లో పహల్గాం ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు మృతి చెందడంతో భారత్ పాక్‌తో సంబంధాలను పూర్తిగా తెంచుకుంది. దీనికి ప్రతీకారంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ క్రమంలో పాకిస్థాన్‌కి నీటి కష్టాలు మొదలైనట్లు తెలుస్తోంది. పాక్‌లోకి ప్రవహించే చీనాబ్ నది నీటి ప్రవాహం తగ్గినట్లు శాటిలైట్ ఫొటోల్లో కనిపిస్తుంది. చాలా వరకు కాల్వలు అన్ని కూడా ఎండిపోతున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి:BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?

ఇది కూడా చూడండి: CSK VS PBKS: పంజాబ్ కింగ్స్ చితక్కొట్టేసింది..చెన్నైకు హ్యాట్రిక్ ఓటమి

నీటి ప్రవాహం తగ్గిందని..

భారత సైన్యంలోని మిలిటరీ ఇంటెలిజెన్స్ కల్నల్ వినాయక్ భట్ పోస్ట్ చేసిన కొన్ని శాటిలైట్ ఫొటోల్లో తెలుస్తోంది. సరిహద్దు దగ్గర సియాల్‌కోట్ ప్రాంతంలోని మరాలా హెడ్‌వర్క్స్ దగ్గర అయితే నీటి ప్రవాహం భారీగా తగ్గిందని తెలిపారు. ప్రధాన కాల్వ నుంచి వెళ్లే డిస్ట్రిబ్యూటరీ కాల్వలో నీటి ప్రవాహం భారీగా తగ్గింది. ఇందులో ఒక నది అయితే పూర్తిగా ఎండిపోయినట్లు కనిపిస్తుంది. ఇంకో ఐదు రోజుల్లో అయితే ఈ నీటి ప్రవాహం ఇంకా కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: CSK VS PBKS: ధనా ధన్.. సామ్ కరన్ కుమ్మేశాడు - పంజాబ్ కింగ్స్‌కు కిక్కు దిగే టార్గెట్!

సింధూ నది చైనాలోని టిబెట్‌లో పుట్టి భారత్, పాకిస్థాన్ మీదుగా ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. దేశ విభజన తర్వాత ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సింధూ నది వాటర్‌ను ఇరు దేశాలు ఉపయోగించుకోవడం, వాటిని వాడుకోవడం వంటివి చేస్తారు. ఈ వాటర్‌లో 80 శాతం.. పాక్ భూముల వ్యవసాయానికి ముఖ్యం. ఈ ఇండర్ వాటర్‌తోనే పాక్‌లో చాలా మందికి నీటి సమస్య లేదు. ఇప్పుడు ఈ వాటర్ ఆపేయడంతో పాక్‌లో నీటి కష్టాలు మొదలయ్యాయని భావిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు