IND PAK WAR: బ్లాక్‌అవుట్ అంటే ఏంటి?.. ఏ సమయాల్లో దీనిని విధిస్తారు?

యుద్ధం లేదా ఎమర్జెన్జీ పరిస్థితుల్లో నగరాన్ని మొత్తం చీకటి చేయడాన్ని బ్లాక్ అవుట్ అంటారు. శత్రువుల వైమానిక దాడులను కష్టతరం చేయడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఇలా చేస్తే శత్రువుల టార్గెట్ మిస్ అవుతుంది. ఫలితంగా దాడుల నుంచి రక్షణ పొందొచ్చు.

New Update

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో పంజాబ్, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంలోని అనేక జిల్లాల్లో అధికారులు గురువారం రాత్రి నుండి పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. భారత వైమానిక దళం (IAF), భారత సైన్యం నుండి హెచ్చరికలు రావడంతో ఆయా ప్రాంతాలను బ్లాక్ అవుట్‌గా పరిగణించారు. 

Also Read :  జమ్మూ లో దుమ్ము దులుపుతున్న భారత్ ఆర్మీ.. 8 మిస్సైళ్లను పేల్చేసిన S- 400

వీటిలో అమృత్‌సర్, జలంధర్ , గురుదాస్‌పూర్, తర్న్ తరణ్, హోషియార్‌పూర్, పఠాన్‌కోట్, ఫిరోజ్‌పూర్, ఫాజిల్కా, చండీగఢ్, హర్యానా వంటి ప్రాంతాలు ఉన్నాయి. వీటితోపాటు మొహాలి, పంచకులాలలో కూడా బ్లాక్‌అవుట్‌గా అధికారులు ఆదేశించారు. ఆర్మీ లేదా వైమానిక దళం నుండి వచ్చే రియల్ టైమ్ హెచ్చరికల ఆధారంగా బ్లాక్‌అవుట్‌లు అమలు చేస్తారు. 

Also Read :  ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. మ్యాచ్ రద్దు

IND PAK WAR

పాక్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బ్లాక్ అవుట్‌గా పలు ప్రాంతాలను చేర్చారు. ఇంతకీ బ్లాక్ అవుట్ అంటే ఏంటి..?.. దీనిని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు? అనే డౌట్ అందరిలోనూ ఉంది. దీని ప్రకారం.. భారత వైమానిక దళం నుండి వచ్చిన సమాచారం ఆధారంగా భద్రతా చర్యగా బ్లాక్‌అవుట్‌ను ఆదేశిస్తారు. ఇది తదుపరి సూచనలు వచ్చే వరకు అమలులో ఉంటుంది. 

ఇది కూడా చూడండి: IND PAK WAR 2025: జైసల్మేర్‌లో 70కి పైగా డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!

బ్లాక్అవుట్ అంటే ఏంటి?

బ్లాక్అవుట్ ప్రధాన ఉద్దేశ్యం.. శత్రువుల వైమానిక దాడులను కష్టతరం చేయడమే. ఒకవేళ రాత్రిపూట యుద్ధ సమయంలో లైట్లు ఉంటే.. శత్రు పైలట్లకు లక్ష్యాలను కనుగొనడాన్ని సులభతరం చేస్తాయి. అందువల్లనే శత్రు పైలట్లు.. నివాస, వాణిజ్య లేదా సైనిక మౌలిక సదుపాయాలను గుర్తించలేకుండా లైట్లు ఆపివేస్తారు. గృహాలు, వీధుల్లోని అన్ని లైట్లు, జనరేటర్, ఇన్వర్టర్ ఆధారిత లైట్లు తదుపరి నోటీసు వచ్చేవరకు క్లోజ్ చేస్తారు. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

యుద్ధం లేదా ఎమర్జెన్జీ పరిస్థితుల్లో నగరాన్ని మొత్తం చీకటి చేస్తారు. దీని కారణంగానే శత్రువుల టార్గెట్ మిస్ అవుతుంది. ఫలితంగా ఆ దాడుల నుంచి రక్షణ పొందేందుకు బ్లాక్ అవుట్ చేస్తారు. బ్లాక్ అవుట్‌కు ముందుగా సైరన్‌లు మోగిస్తారు. ఆ తర్వాత లైట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఆపేయాల్సి ఉంటుంది. భారత్‌లో 53 ఏళ్ల తర్వాత నిన్న సరిహద్దు నగరాల్లో బ్లాక్ అవుట్ విధించారు.

operation Sindoor | Jammu Airport Attack | ind pak war | ind pak war updates | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు