IND-PAK WAR: పాక్ అబద్ధాలపై భారత ఆర్మీ సంచలన వీడియో-VIDEO

భారత పౌరులపై దాడులు చేయడం లేదని పాక్ అబద్ధాలు ఆడుతోంది. వీటిని తిప్పికొడుతూ భారత ఆర్మీ ఓ వీడియోను రిలీజ్ చేసింది. జమ్మూకశ్మీర్‌లో శంభూ దేవాలయాన్ని పాక్ ధ్వంసం చేసినట్లు రక్షణ శాఖ ఫొటోలు, వీడియోను విడుదల చేసింది.

New Update

భారత్ కేవలం ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసి దాడులు చేస్తుంటే.. పాక్ సాధారణ పౌరులపైనే దాడులకు ప్రయత్నిస్తోంది. కానీ సాధారణ ప్రజలపై దాడులు చేయడం లేదని పాక్ అబద్ధాలు ఆడుతోంది. వీటిని భారత ఆర్మీ తిప్పికొడుతూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. జమ్మూలోని స్కూళ్లు, ఆలయాలు, సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాలపైన పాక్ దాడులకు పాల్పడుతోందని ఆధారాలతో తెలియజేసింది. జమ్మూకశ్మీర్‌లోని శంభూ దేవాలయాన్ని ధ్వంసం చేసినట్లు రక్షణ శాఖ ఫొటోలు, వీడియోను విడుదల చేసింది. పాక్ రాత్రంతా కూడా డ్రోన్లతో దాడులు చేస్తోందని వాటిని తిప్పికొట్టినట్లు భారత ఆర్మీ తెలిపింది. 

ఇది కూడా చూడండి: Pakistan: 'మా రాజకీయ నేతల ఇళ్లపై దాడులు చేయండి'.. పాక్‌లో ప్రజల తిరుగుబాటు

ఇది కూడా చూడండి: BIG BREAKING: మళ్లీ మొదలైన యుద్ధం.. పాకిస్థాన్ కాల్పులు

ఎస్‌-400‌ను ధ్వంసం చేశామని తప్పుడు వార్తలు..

ఇదే కాకుండా చైనాతో కలిసి పాక్ భారత్‌పై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోంది. అత్యంత శక్తివంతమైన భారత్ గగనతల రక్షణ వ్యవస్థ ఎస్‌-400‌ను ధ్వంసం చేసినట్లు ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తోంది. దాదాపుగా 600 కిలోమీటర్ల వరకు రాడార్ రేంజ్ ఉంటుంది. దీన్ని పాకిస్తాన్ జేఎఫ్‌-17 యుద్ధ విమాన క్షిపణితో కూల్చేసిందని చైనా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ఫేక్ న్యూస్ అని, ఎస్‌-400‌ను ధ్వంసం చేయలేదని భారత సైనికాధికారులు వెల్లడించారు.

ఇది కూడా చూడండి: IND-PAK WAR: వార్ ఎఫెక్ట్.. Deloitte, HCL, టెక్ మహీంద్రాతో పాటు WFH ప్రకటించిన కంపెనీల లిస్ట్ ఇదే!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు