/rtv/media/media_files/2025/04/29/fK54xnJ0P3vZZM6eLKwS.jpg)
Ind pak war
పహల్గాం ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు మృతి చెందారు. ఈ దాడి తర్వాత భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లో కాల్పులు కూడా జరుగుతున్నాయి. ఉగ్రవాదులు దాడులు చేయడంతో భారత్లో ఉన్న పాక్ పౌరుల అంతా కూడా వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇది కూడా చూడండి: Trump effect on Tollywood: తెలుగు సినిమాకు ట్రంప్ దెబ్బ.. 7 వేలు దాటనున్న టికెట్ ధరలు!
యుద్ధం జరగబోతుందని జ్యోతిష్యులు..
సరిహద్దుల్లో మాత్రం యుద్ధ వాతావరణమే ఉంది. భారత్, పాక్ మధ్య యుద్ధం ఎప్పుడు జరుగుతుందని ప్రపంచం మొత్తం చూస్తోంది. అయితే మరో 36 గంటల్లో యుద్ధం జరగబోతుందని న్యూస్ 18 హిందీ వెబ్సైట్ ప్రకటించిన కథనంలో జ్యోతిష్యులు తెలిపారు.
ఇది కూడా చూడండి: VIRAL VIDEO: వెడ్డింగ్ షూట్లో విషాదం.. వధువుపై పేలిన బాంబు.. వీడియో వైరల్
ఓ ప్రముఖ జ్యోతిష్యుడు మరో 36 గంటల్లో భారత్, పాక్ మధ్య యుద్ధం జరగబోతున్నట్లు తెలిపారు. నియంత్రణ దగ్గర భయంకరమైన పరిస్థితులు సంభవిస్తాయన్నారు. ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగితే.. పాక్లోని ఎక్కువ భాగం భారతదేశంలోకి వస్తుందని తెలిపారు. కొన్ని గ్రహాల స్థానాల వల్ల భారత్కు యుద్ధ విషయంలో అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు వెల్లడించారు.
ఇది కూడా చూడండి: Indo-Pak tension: పాకిస్థాన్పై దాడి లాంఛనమే.. IAF చీఫ్తో ప్రధాని మోదీ
శని గ్రహ సంచారం వల్ల భారత్, పాక్ మధ్య సంబంధాలు మరింత ప్రభావితం అవుతాయని తెలిపారు. యుద్దం జరిగితే పాకిస్థాన్ ఆర్థికంగా, సైనికంగా భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని వెల్లడించారు. యుద్ధం జరిగితే పాక్లో కొన్ని ప్రాంతాలు భారత్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే ఈ యుద్ధం రెండు దేశాల మధ్య మాత్రమే కాదని, మిగతా దేశాలు కూడా ఈ యుద్ధంలో పాల్గొనవచ్చని జ్యోతిష్యులు తెలిపారని న్యూస్ 18 హిందీ కథనం తెలిపింది.
ఇది కూడా చూడండి: Naa Anveshana: యూట్యూబర్ అన్వేష్ అడ్డంగా దొరికేశాడు.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వీడియో వైరల్!